Home News భయపడుతున్న ముస్లిం – ఒక బూటకపు కధనం

భయపడుతున్న ముస్లిం – ఒక బూటకపు కధనం

0
SHARE

హిందువులు మెజారిటీగా ఉన్న  భారతదేశంలో “ముస్లిములు భయపడుతూ జీవనం సాగిస్తున్నారు” అంటూ కుహనా లౌకికవాదులు, వారికున్న అపారమైన వనరులతో, చాలా జాగ్రత్తగా అల్లుకుంటూ ఒక బూటకపు కధనాన్ని సృష్టిస్తున్నారు.  దీన్ని మరింత విస్తృతం చేయడానికి `విద్వేష సూచిక’ ను కూడా వెలువరించారు. అయితే వాస్తవం దీనికి వ్యతిరేకంగా ఉంది.  

`హిందూ తీవ్రవాదం’ అని పత్రికలలో, వెబ్ సైట్లలో పతాక శీర్షికలు పెడుతూ, భారతదేశం ఏ విధంగా `అధిక సంఖ్యాక దేశం’గా మారుతోంది అంటూ, హిందూ-ముస్లిం నేరాలలో, కేవలం ముస్లింలు బాధితులుగా ఉన్న వార్తలు మాత్రమే వ్రాస్తూ, హిందువులు బాధితులుగా ఉన్న నేరాలు అసలు వార్తలలో రాకుండా చేస్తోంది ఈ కుహనా `ఉదారవాద, లౌకిక’ వర్గం.      

`భయపడుతున్న ముస్లిం’ కథనoలో భాగంగా ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాకే, `అధిక సంఖ్యాకు’లైన హిందువులు నిరంకుశంగా మారారని, వారి ముందు ముస్లిములు భయంతో వణికిపోతున్నారని చెప్పబడుతోంది. ఎవరైనా హిందువు నేరo చేసినప్పుడు, ఆ నేరానికి ఏ మాత్రం మత సంబంధం లేకున్నా, దానిని పదింతలు పెంచి ప్రచారం చేస్తారు; ముస్లిములు మతపరమైన విద్వేషపూరిత నేరాలకు పాల్పడినప్పుడు వాటిని పూర్తిగా విస్మరించి, వార్తల్లోకి రాకుండా తొక్కిపెడతారు. కుహనా లౌకికవాద  కధనానికి నిజం వల్ల నష్టం కలుగుతుంది, కాబట్టి నిజాలను బయటకి రానివ్వరు.    
2016 నుంచి మైనారిటి వర్గం మత విద్వేషంతో చేస్తున్న నేరాలను ఈ వ్యాసంలో పొందుపరుస్తున్నాము, పైన చెప్పిన బూటకపు కధనంలోని అసత్యాలను ఇది బయటపెడుతుంది. హిందువులు ఆందోళన చెందుతున్న నిజం, అనగా ముస్లిoలలో విస్తృతంగా ఉన్న మత ఛాoదసవాదాన్ని ఇది ఎత్తి చూపుతుంది. కుహనా ఉదారవాదులు/కుహనా మేధావులు దాచిపెట్టే ముస్లిముల ఖచ్చితమైన నేరాల పట్టిక ఇది, ఇది సంపూర్ణం కూడా కాదు. 

1.     కాలియాచాక్ అల్లర్లు, పశ్చిమ బెంగాల్
అంజుమన్ ఆహ్లె సున్నతుల్ జమాత్(ASJ) జెండా కింద 2.5లక్షలమంది ముస్లిం గుంపులు (తక్కువ అంచనా ప్రకారం 30000), పశ్చిమ బెంగాల్ మాల్దాలో, కాలియాచాక్ పోలీస్ స్టేషన్, తాలుకా ఆఫీసు, ఇతర ప్రజా ఆస్తులపై 3 జనవరి 2016 రోజున దాడిచేసి వాటిని విధ్వంసం చేసారు. వాహనాలు తగలబెట్టారు, పోలీసు అధికారులు, ఇతరులు 30పైగా గాయపడ్డారు.

 సమాజ్వాది పార్టీ నేత ఆజం ఖాన్ ఆరెఎసెఎస్ నేతలను స్వలింగ సంపర్కులు అని దూషించినప్పుడు, దానికి వ్యతిరేకంగా కమలేశ్ తివారి మహమ్మద్ ప్రవక్త ప్రపంచoలో మొదటి స్వలింగ సంపర్కుడు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినపుడు ఈ అల్లర్లు చెలరేగాయి.

2.     ధులాగడ్ అల్లర్లు, పశ్చిమ బెంగాల్
13 డిసెంబర్ 2016 తేదీన, మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన ఈద్ఉల్ మిలాద్ (అది అంతకుముందు రోజు 12 డిసెంబర్ అయినప్పటికీ) సందర్భoగా ధులాగర్ గ్రామంలో, లౌడ్ స్పీకర్లతో సహా ఒక ఊరేగింపు తీసుకెళ్ళారు. ఆ రోజు హిందువుల మార్గశిర పౌర్ణమి పండుగ. హిందువులు లౌడ్ స్పీకర్ల శబ్దం తగ్గించమని ముస్లింలను కోరగా, హిందువుల ఇళ్ళను, దుకాణాలను ముస్లిములు దోచుకుని తగలబెట్టారు; అల్లర్లను అదుపు చేయదానికి వచ్చిన పోలీసుల మీద బాంబుల దాడి చేయగా, వారు నిస్సహాయంగా ఉండిపోయారు. హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తూ `పాకిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు చేసారని బాధితులు తెలియచేసారు, ఈ వార్తను ప్రసారం చేసిన `జీ న్యూస్’ పైన రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.    

3.     ప్రేమ జిహాద్(లవ్ జిహాద్): రమా కుమారి ఓజ్హా
ఒక హిందూ మహిళ, జనవరి 2018లో, తన్వీర్ అఖ్తర్ ఖాన్, తనను మోసంచేసి పెళ్లి చేసుకుని, తర్వాత మతం మారమని హింసించాడని ఆరోపించింది. తన మతం గురించి చెప్పకుండా మోసంచేసి పారిపోయి, తర్వాత తాము పెళ్లి చేసుకున్నారని ఆమె చెప్పింది. ఆరునెలల పాటు తనను బలవంతంగా బంధించి, క్రూరంగా హింసించారని, మోసంతో గోమాంసం తినిపించి, కాబట్టి హిందూమతం తాను పోగొట్టుకుందని చెప్పారని, తాను ఆత్మహత్యకై ప్రయత్నం చేసినా, ఎలాగో బ్రతికి బయటపడ్డానని ఆమె చెప్పింది. గృహ హింస, దాడి, అక్రమ సంబంధం క్రింద తన్వీర్ అఖ్తర్ ఖాన్ పై పోలీసులు కేసు పెట్టి, రమను ఆమె పుట్టింటికి పంపించారు.   

4.     అంకిత్ సక్సేనా హత్య
ఫిబ్రవరి 2018 ఢిల్లీలో, అంకిత్ సక్సేనాను అతని ముస్లిం ప్రేమికురాలి (పేరు షేహ్జాది అని పేర్కొనబడింది) కుటుంబం, వారి మతాంతర ప్రేమను వ్యతిరేకిస్తూ, అతన్ని దారుణంగా హత్య చేసింది. షేహ్జాది తల్లి స్కూటర్ మీద వెళ్లి, రోడ్డుమీద అంకిత్ ని అతని వాహనంనుంచి కిందకు పడదోయగా, మిగతా కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని అతని మీద దాడికి దిగారు, ఆమె తండ్రి కసాయి కత్తితో అంకిత్ గొంతు కోసేసాడు. పోలీసులు ఆమె కుటుంబంలోని నలుగురిని అరెస్ట్ చేసారు. 

5.     దళిత వ్యక్తి శవ-యాత్ర ఊరేగింపు గురించి దళితులు-ముస్లింల కొట్లాట
మే 2018లో, తమిళనాడు తేని జిల్లా, బొమ్మినాయికన్పట్టి  గ్రామంలో, ముస్లిముల వీధిలో, ఒక దళిత వ్యక్తి శవ-యాత్రను తమ వీధిలో చేయవద్దని ముస్లిములు నిరోధించడానికి ప్రయత్నించగా, మత సంబంధమైన కొట్లాట చెలరేగింది.      

6.     బీహార్ లో ఈద్ పండుగ సందర్భంగా పాకిస్తాన్ అనుకూల పాటలు, బెదిరింపులు
జూన్ 2018 బీహార్ రోహ్తాస్ జిల్లాలో, ఈద్ పండుగ సందర్భంగా, ఎనిమిది మందిని అరెస్ట్ చేసారు. కారణం, ADJ పార్టీ, లౌడ్ స్పీకర్లలో, పాకిస్తాన్ అనుకూల పాటలు వేస్తూ, ఒక ఉగ్రవాద సంస్థను పొగుడుతూ, ఇస్లామిక్ రాజ్య స్థాపనని వ్యతిరేకించేవారిని చంపుతామని బెదిరిస్తూ ప్రకటనలు చేసారు. సోషల్ మీడియాలో వీడియోల ప్రచారం బాగా జరిగింది. రోహ్తాస్ జిల్లా ఎస్పి సత్యవీర్ సింగ్ వీడియోలు చూసి, ముగ్గురిని అరెస్ట్ చేసి, ఇంకో అయిదుమంది మైనర్ యువకులను, జిల్లా బాలనేరస్థుల బోర్డుకి తరలించారు.    

7.     ముస్లిం యువతితో ప్రేమ, దళిత యువకుడి హత్య
రాజస్తాన్ బార్మేర్ జిల్లా, పోలీస్ స్టేషన్ సమీపంలో, ముస్లిం యువతిని ప్రేమించిన కారణంగా, ఖేతారాం భీల్ అనే ఒక 22సం. దళిత యువకుడిని కొంతమంది ముస్లిములు, చేతులు కాళ్ళు కట్టేసి దారుణంగా కొట్టి చంపేశారని పోలీసులు చెప్పారు. పారిపోవడానికి ప్రయత్నిస్తూ అతను చనిపోయాడు. భీల్ ముస్లిం ఇంట్లో పనిచేస్తూ, ఆ యువతిని ప్రేమించాడని ఆ ఊరందరికీ తెలుసు.     

8.     దళిత మహిళలపై వేధింపుల తర్వాత దళితులు –ముస్లిముల ఘర్షణలు
ఉత్తరప్రదేశ్ సిద్ధార్థనగర్ జిల్లా ఇట్వా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే గోర్యా గ్రామంలో, మే   2018లో ఒక `సముదాయానికి’ చెందిన కొందరు, ఒక పెళ్లి ఊరేగింపులోని మహిళలను వేధించారు. మహిళలు అభ్యంతరం చెప్పగా, వారిని, వారిని కాపాడడానికి వచ్చిన వారిని, వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్లి మరీ దాడి చేసారు. దళితుల మీద జరిగిన ఈ దాడిలో, 70మంది మీద కేసు నమోదు చేసి, కొందరిని అరెస్ట్ చేసారు. మిరాజ్, థప్పు, ఇజ్హర్, నషిర్, అర్షద్, అల్తాఫ్ హుసైన్, ఫిరోజ్ ల మీద  సెక్షన్లు 147, 148, 149, 307, 452, 323, 336, 504, 506, 427 క్రింద కేసులు నమోదైనాయని ఇట్వా పొలిసు అధికారి అంజని కుమార్ రాయ్ తెలిపారు. 

9.     కులం పేరుతో దళితులను దూషణ, దళితులు –ముస్లిముల కొట్లాటలు
వ్యక్తిగత గొడవగా ఈ సంఘటన జూలై 2017లో మొదలైంది. కమిల్ రజా, నసీం గుడ్లు కొనడానికి వెళ్లి, వాటి ధర గురించి గొడవపడి, తరువాత సునీల్, అతని స్నేహితులను వారి దళిత పాశ్వాన్ కులం పేరుతో దూషణకి దిగారు. ఇరు వర్గాలనుoచి మరింతమoది చేరి, ఘర్షణకి దిగారు, అక్కడ ఇళ్ళకు దుకాణాలకు ఎంతో నష్టం జరిగింది. వందలాది మంది అల్లర్లకు దిగడంతో, పెద్ద సంఖ్యలో పోలీసులను రంగంలోకి దింపారు.   

10. ఇస్లాం మత బోధకుడి అరెస్ట్
కేరళ జాకీర్ నాయక్ గా పిలువబడే ఇస్లాం మత బోధకుడు ఎం.అక్బర్ ను కతార్ కు వెళ్తుండగా ఫిబ్రవరి 2018లో పోలీసులు అరెస్టు చేసారు. కోచి లోని `పీస్ ఇంటర్నేషనల్ స్కూల్’ డైరెక్టర్ ఉన్న అక్బర్ పాఠ్యపుస్తకాల ద్వారా మత విద్వేషాలను రెచ్చగొట్టేవాడు. ఉదాహరణకి, రెండవ తరగతి పుస్తకంలో `ఇస్లాం ఎందుకు ఎప్పుడూ గెలుస్తుంది?’,`ఒక పిల్లవాడు ముస్లింగా మారదలుచుకుంటే ఇతర విద్యార్థులు ఏమి చేయాలి?’ లాంటి అంశాలతో పాటు, ముస్లిమేతర విద్యార్థులతో ఎలా మెలగాలి లాంటివి కూడా ఉన్నాయి. 

11. హనుమంతుడి విగ్రహo ధ్వంసం
ఉత్తరప్రదేశ్ ప్రతాప్.గడ్ ఊరిలో ఒక `మతి చాంచల్యం’ ఉన్న వ్యక్తి, హనుమంతుడి గుడి తాళం పగలగొట్టి, విగ్రహాన్ని ధ్వంసం చేసి బయట పడేసి, నమాజ్ చేసిన తరువాత, మతపరమైన నినాదాలు చేయడం ప్రారంభించాడు. ప్రజలు గమనించి, అతనిని పట్టుకోగా పోలీసులు అరెస్ట్ చేసారు.

12. ఆగ్రాలో దళితులు –ముస్లిముల ఘర్షణలు
ఆగ్రా మoటోలా ప్రదేశం టీలానందరాంలో ఫిబ్రవరి 2019 దళితులు- ముస్లిముల మధ్య మత కలహాలు చెలరేగాయి. జైనీప్రసాద్ కొడుకు ప్రమోద్ అనే దళిత పిల్లవాడు, RO పంపు నుంచి నీళ్ళు తెస్తుండగా, సల్మాన్ షారుఖ్ అనే ఇద్దరు ప్రమోద్ ని కిందపడేయగా, అది పెద్ద ఘర్షణకి దారితీసింది. ప్రమోద్ ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులను పిలుచుకుని రాగా, అప్పటికే అక్కడ యూసుఫ్ అక్రం ఇంకా వందకి పైగా ముస్లిములు గుమిగూడి, దళితుల ఇళ్ళపై బుల్లెట్లతో, ఇంకా గాజు సీసాలతో దాడిచేసి ఎంతోమందిని గాయపరిచారు.       

13. తమిళనాడులో మతమార్పిడులను ఆపడానికి ప్రయత్నించిన కార్యకర్త హత్య
మతమార్పిడులను నిరోధించడానికి ప్రయత్నించినందుకు, ఫిబ్రవరి 2019లో తంజావూర్ జిల్లాలోని కుంభకోణంలో, గుర్తు తెలియని దుండగులు PMKకి చెందిన 42 సం. రామలింగం అనే కార్యకర్తపై దారుణంగా దాడిచేసి, అతని చేతులను ఖండించారు. రక్తం విపరీతంగా పోవడంతో, హాస్పిటల్ చేర్చేముందే రామలింగం మరణించాడు. జాతీయ దర్యాప్తు సంస్థ NIA, ఇది మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి ఉద్దేశించిన చర్య కాబట్టి దీనిని ఉగ్రవాదoగా పరిగణించాలని పేర్కొంది. నిందితులు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అయిన `పాపులర్ ఫ్రంట్ అఫ్ ఇండియా’(PFI)కి చెందిన వారు.     

14. హోలీ పండుగలో మత కలహాలు
ఉత్తరప్రదేశ్ పిలిభిట్ జహానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుకారిఖేరా గ్రామంలో, హోలీ పండుగ సందర్భంగా, షకీర్, షబీర్ అనే ఇద్దరు మార్చ్2019లో మత కలహాల్లో అరెస్టు అయారు. 45సం జయప్రకాశ్, సుభాష్, రాజరిషి, పింటూ, చేడేలాల్, మరియు కొందరు ముస్లింలకు మధ్య కొట్లాట జరిగింది. వాళ్ళ మీద రంగులు జల్లారని కొందరు ముస్లిములు జయప్రకాశ్ మరియు ఇతరుల మీద తీవ్రంగా దాడి చేసారు. తలమీద కొట్టిన బలమైన గాయాల వల్ల, జహానాబాద్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నుంచి బరేలీకి తరలించేలోపు జయప్రకాశ్ మరణించాడు.      

15. దళితులపై ముస్లిముల దాడి
ఉత్తరప్రదేశ్ దేవరియా గౌరీబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్జహన్ గ్రామంలో, ఏప్రిల్  2019లో, ముస్లిం గుంపు దళితులపై దాడి చేసింది. రెహ్మత్ అలీ అనే ముస్లిం వ్యక్తి దళిత అమ్మాయిని వేధిస్తే, దళితులు అతనిని వ్యతిరేకించడం వల్ల ఈ దాడి జరిగింది. ఏప్రిల్18న,  రెహ్మత్ అలీ ఒక ఇంట్లోకి జొరబడి, అమ్మాయి మీద అత్యాచారం చేయబోగా, ఆమె అరిచి అందరినీ పిలిచింది. అతను పారిపోయాడు. మళ్ళి మర్నాడు రెండవసారి కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించగా, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అతను మళ్ళి పారిపోయి ఈసారి చాలా మందిని వెంటబెట్టుకుని కర్రలు ఇతర ఆయుధాలతో వచ్చాడు. ఈ గుంపు ఆ దళిత కుటుంబాన్ని, ఇతరులని కర్రలతో కొట్టి గాయపరిచింది, గాయపడ్డవాళ్లల్లో మహిళలు పిల్లలు కూడా ఉన్నారు. అక్కడి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కొంత ధ్వంసం చేసారని చెప్పబడుతోంది.  ఈ దౌర్జన్యo గంటసేపు పైగా కొనసాగింది. అప్పటికి మిగతా ఊరంతా కదిలివచ్చాక ఈ గుంపు వెనక్కి తగ్గింది.

16. సొంత చెల్లెలినే చంపిన సోదరుడు
ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లా కరువా-సహబగంజ్ గ్రామంలో, ఒక ముస్లిం యువతి హిందూ యువకుడిని పెళ్లి చేసుకుని మతం మారినందుకు, సొంత అన్న, ఇతర కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురైంది. 19సం. మోహిని (పెళ్ళికి ముందు నర్గిస్), అదే గ్రామంలోని హిందూ యువకుడు రామకిశోర్ వివాహం చేసుకోవాలనుకున్నారు. నర్గిస్ కుటుంబం ఒప్పుకోకపోవడంతో రిజిస్టర్ పెళ్లి చేసుకుని, వారి కోపంనుంచి తప్పించుకోవడానికి వేరొక ఊరికి వెళ్ళిపోయారు. అయినా ఆమె అన్న గుల్షేర్ ఆ ఊరు వెళ్లి ఆమెని అక్కడికక్కడే చంపేయగా, రామకిశోర్ని హాస్పిటల్లో చేర్చారు. ri  ri 

17. గర్భిణిని హత్య చేసిన కుటుంబం
కర్నాటక బీజాపూర్ జిల్లా గుండకనాల గ్రామంలో జూన్ 2017 లో, ఒక ముస్లిం యువతి, హిందువుని పెళ్లి చేసుకున్నందుకు ఆమె కుటుంబం ఆమెని నిలువునా కాల్చి చంపేసింది. 21సం. బాను బేగం, అదే గ్రామంలో హిందూ వాల్మికి కులానికి చెందిన 24సం. కొన్నూరు సయబన్నశరణప్ప ప్రేమించుకున్నారు. ఇది తెలిసి, ఆ సంవత్సరo జనవరిలో, ఆమె కుటుంబం శరణప్పను దారుణంగా కొట్టారు. వారిద్దరూ ముందు గోవా వెళ్లి, తరువాత కర్ణాటక ముద్దేబిహల్ రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు. ఆమె గర్భవతి అయాక, పాత కోపాలు మర్చిపోతారులే అనుకుని గ్రామానికి తిరిగి రాగానే, బేగంని ఆమె కుటుంబం కాల్చి చంపేసింది.  

18. ముస్లిం యువతి, హిందూ యువకుడి హత్య
బీహార్ పశ్చిమ చంపారణ్ జిల్లాలో,  27 నవంబర్ 2017 రాత్రి, ఒక ముస్లిం కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు (ఒక మహిళతో సహా), చిన్న వయసు అని కూడా చూడకుండా, తమ కూతురిని, ఒక హిందూ యువకుడిని హత్య చేసారు. 9వ క్లాసులో ఉన్న ఆ ఇద్దరు, నూర్జేహన్ మరియు ముఖేష్ కుమార్, ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారని తెలుసుకుని, బాలిక కుటుంబం వారిద్దరినీ చంపేశారు. ఆమె అన్న అన్సారీని, ఇద్దరు మామలను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆమె అక్క ఇంకా పరారీలోనే ఉంది.

19. ముస్లిం యువతితో పారిపోయిన హిందూ యువకుడి కుటుంబంపై దాడి 
ఒక హిందూ యువకుడు ముస్లిం యువతితో జూన్29న పారిపోయిన తరువాత, గుజరాత్ దాహోడ్ జిల్లా సంజేలి గ్రామం, జూలై 2018లో, 200మంది పైగా ఉన్న ముస్లిం గుంపు, అతని ఇంటిపై దాడి చేసింది. యువకుడి కుటుంబం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చి, ఆ యువతిని వెనక్కి రప్పించమంది.  వారి జాడ ఆ కుటుంబానికి తెలియదు. అయినా వినక, చివరికి ముస్లిం సముదాయం పెద్ద సంఖ్యలో హిందూ యువకుడి ఇంటి మీద జులై21న దాడి చేసింది. ఈ గుంపు కర్రలు, ఇతర పదునైన ఆయుధాలతో వచ్చి ఆ ఇంటివారి మీద దాడి చేసి, వస్తువులన్నీ లూటీ చేసి, వాహనాలు కాల్చేసి, ఇంటిని నాశనం చేసారని సంజేలి సబిన్స్పెక్టర్ ఎసెన్ బరియా తెలిపారు.

20. హిందూ యువకుడి మీద ముస్లిమ్ గుంపు దాడి
కేవలం ముస్లిం మహిళతో మాట్లాడాడనే కారణంతో సురేష్ అనే యువకుడి మీద కర్ణాటక బంట్వాల్ ఫరంగిపేటలో జులై 2018లో ముస్లిం గుంపు దాడి చేసింది. సురేష్ ఇంటికి తిరిగి వెళ్తూ, ఫరంగిపేటలో తెలిసిన మహిళ కనిపిస్తే కారు ఆపి పలకరించాడు. ముస్లిమ్ గుంపు ఇది చూసి కారుకి అడ్డంగా దారికాసి, అతన్ని తిట్టి దాడి చేసారు.  ఐపిసి సెక్షన్లు 144, 323, 504, 149 కింద పొలీసులు కేసు నమోదు చేసారు.

21. మతపరమైన ఉద్రిక్తత
ఉత్తరప్రదేశ్ ముజఫ్ఫర్నగర్ ఖతౌలి ప్రాంతం ఖానజహన్పుర్ గ్రామంలో జూన్2018లో మతపరమైన హింస చోటుచేసుకుంది. ఇద్దరు గ్రామస్థులు అర్షద్, నజీం వ్యాపార విషయంలో గొడవపడి కొట్టుకున్నారు. నజీం స్నేహితుడు వికాస్, అతన్ని కాపాడడానికి ముందుకొచ్చాడు. తర్వాత అర్షద్, బిలాల్, మున్నా, ఉస్మాన్, జావేద్ మొదలైనవారు పెద్ద గుంపుతో వికాస్ ఇంటిపై దాడి చేసి, మహిళలను కూడా వేధించారు. ఈ దాడి మూలంగా, గ్రామoలో మతపరమైన ఉద్రిక్తత నెలకొంది, ఆ తరువాత నిందితులు గ్రామంనుంచి పారిపోయారు.  

22. ముస్లిం యువకుడి చేతిలో హిందూ తండ్రి హత్య 
ఉత్తరప్రదేశ్ గోoడా జిల్లా కాత్రాబజార్ అక్టోబర్ 2018లో, తన కూతురిని లైంగిక వేధింపుకు గురిచేయడాన్ని ప్రశ్నించినందుకు 50సం తండ్రిని,  షా మొహమ్మద్, దోస్త్ మొహమ్మద్, యార్ మొహమ్మద్ అనే ముగ్గురు ముస్లిం సోదరులు, కిరాతకంగా కొట్టి చంపేశారు. టాయిలెట్కి  వెళ్తున్న మైనర్ యువతిపై అత్యాచారం చేయబోతే, ఆమె తన తండ్రికి చెప్పగా, ఆయన ముస్లిం యువకుల ఇంటికి వెళ్లి ప్రశ్నించగా, ఆయనను దారుణంగా కొట్టారు. ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళేలోపు, ఆ తండ్రి చనిపోయాడు.  ఈ హత్య వల్ల కాత్రాబజార్లో ఉద్రిక్తత నెలకొనగా, జిల్లా అధికారులు భారీ సంఖ్యలో గ్రామంలో పోలీసులను మొహరించారు.

23. ఆర్ఎస్ఎస్ కార్యకర్త శవయాత్రలో రాళ్ళు రువ్విన ముస్లిం గుంపు
మంగళూరు బిసిరోడ్ 4జులై 2017తెదీన, బైక్ మీద వచ్చిన గుర్తు తెలియని హంతకులు, 28సం ఆర్ఎస్ఎస్ కార్యకర్త శరత్ మడివాలను పొడిచి హత్య చేసారు. అనేక సంస్థల కార్యకర్తలు బైక్లు నల్లజెండాలతో అతని శవయాత్రలో పాల్గొన్నారు, ఊరేగింపు బిసిరోడ్ దగ్గరకు రాగానే రాళ్ళ వర్షం కురిసింది. మంగళూరు పాత మేయర్ అష్రఫ్, సుహెల్ ఖడక్, అష్రఫ్ కినార్ కుద్రోలి, ముత్తప్ప, మొహమ్మద్ హనీఫ్, హమీద్ కుద్రోలి, నౌషాద్ మొదలైనవారిని, అల్లర్లు ప్రేరేపించడం మరియు ఆస్తుల నష్టం నేరాల కింద అరెస్ట్ చేసారు. కార్లు, బస్సులు, ఆటోలు రాళ్లవర్షంలో పాడైపోయాయి.     

24. `కావరియా’ యాత్రపై ముస్లిం గుంపు దాడి 
ఉత్తరప్రదేశ్ బరేలీ జిల్లా అలిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిలం ప్రాంతంలో, ముస్లిం గుంపులు జులై2017లో, కావరియా (శైవ భక్తులు) యాత్ర `తమ ప్రాంతం’ లోంచి వెళ్లకూడదని, మతపరమైన కొట్లాటలు ప్రారంభిoచగా, వీటిలో వందలాది భక్తులేకాక, పోలీసులు కూడా గాయపడ్డారు. `ముస్లిం ప్రాంతం’ నుంచి యాత్ర సాగకూడదని అంటే, హిందువులు వినలేదు, రామగంగ నదికి వెళ్ళడానికి మార్గం అదే అని, ప్రతి సంవత్సరo యాత్ర అటే సాగుతుందని చెప్తూ వారు అక్కడే ఆగిపోయారు. మూడుగంటల పాటు ట్రాఫిక్ ఆగిపోయింది. యాత్ర ఆ ప్రాంతంనుంచి వెళ్తున్నపుడు ఏ పాటలు పాడకుండా మౌనంగా వెళ్ళాలని ప్రబుత్వ సిబ్బంది సూచించారు. అయితే యాత్ర అక్కడ అడుగు పెట్టగానే, హటాత్తుగా ఇటుకలు రాళ్ళతో కావరియా యాత్ర మీద దాడి జరిగింది, కొన్ని చోట్ల వారి మీద కాల్పులు కూడా జరిగాయి. వారిని లాగి కొట్టి బాధించడం జరిగింది. ఈ గలాభాలో కావరియా యాత్ర తొక్కిసలాట జరిగి, ఎంతోమంది గాయపడ్డారు.               

25. ముస్లిం బాలికను చెట్టుకి కట్టేసి కొట్టారు
బీహార్ నవాడా జిల్లా రాజౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో జోగియామరాన్ గ్రామంలో అక్టోబర్ 2018లో, 18సం ముస్లిం బాలికను, ఐదు గంటలపాటు చెట్టుకి కట్టేసి కొట్టారు, స్థానిక పంచాయత్ ఆదేశాల ప్రకారమే ఈ `శిక్ష’ అమలు పరచబడిందనే కథనాలు కూడా ఉన్నాయి, ఆ బాలిక చేసిన `నేరం’, తను ప్రేమించిన హిందూ పురుషుడితో `పారిపోవడం’.  అంతకుముందు 30సెప్టెంబర్, మొహమ్మద్ ఫరీద్ అన్సారీ కూతురు, రూపేష్ కుమార్ అనే హిందువుతో ఊరువదిలి వెళ్ళిపోయింది. ఆమెని పట్టుకుని చెట్టుకి కట్టేసి చితకబాదారు.  ri  

26. ముస్లిం యువతిపై సొంత అన్నల ఆసిడ్ దాడి
ఉత్తరప్రదేశ్ బులందషహర్ గులౌతి ప్రాంతంలో, 9 మే 2019 తేదిన, 22సం సల్మాపై ఆమె అన్నలు ఇర్ఫాన్ మరియు రిజ్వాన్ ఆసిడ్ దాడి చేసి, గ్రేటర్ నోయిడా జిల్లా దాద్రి కోట్ గ్రామంలో కదులుతున్న కారులోంచి ఆమెని క్రిందకి తోసేసి, వారిద్దరూ కారులో పారిపోయారు. దీనికి కారణం ఆమె హిందువుని ప్రేమించడమే అని చెప్పబడుతోంది. ఆసిడ్ వల్ల ఆమె శ్వాసకోశ పూర్తిగా దెబ్బతిని, ఆమెని హాస్పిటల్లో `లైఫ్-సపోర్ట్’ మీద ఉంచారని, పోలీసు అధికారి అవనీశ్ కుమార్ సింగ్ తెలిపారు.    

27. తండ్రి, అన్న చేతిలో ముస్లిం యువతి హత్య
పశ్చిమ బెంగాల్ పూర్వబుర్ద్వాన్ జిల్లా ఆగస్ట్ 2018లో, ఒక హిందూ పురుషుడిని ప్రేమించిన కారణంగా ఆమె తండ్రి అన్న ఒక ముస్లిం యువతిని గొంతు పిసికి చంపేశారు,  బిహార్ జమాల్పురకి  చెందిన ఈ ఇద్దరు, కదులుతున్న వాహనంలో, ఆ యువతిని తాడుతో గొంతు బిగించి హత్యచేసి, గుర్తుపట్టడానికి వీలులేకుండా ఆమె ముఖాన్ని రాయితో కొట్టి, జమాల్పుర దగ్గర ఒక పొలంలో పడేసారని పోలీస్ అధికారి చెప్పారు. వారిద్దరూ తర్వాత కలకత్తాలో పట్టుబడ్డారు.       

28. దళితుల పెళ్లి ఊరేగింపుపై ముస్లిముల దాడి, వ్యక్తి హత్య   
మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లా పీపలర్వా గ్రామం మే2019లో దళితుల పెళ్లి ఊరేగింపు స్థానిక మసీదు ముందునుంచి రాత్రిపూట వెళ్తుండగా, ముస్లిముల గుంపు ఊరేగింపుపై దాడిచేసింది. బిగ్గరగా సంగీతం మ్రోగుతున్నoదుకు అభ్యంతరం చెప్పి, ఊరేగింపు ముస్లిముల మాట వినని కారణంగా, వారిపై దాడికి దిగారు. ధర్మేంద్ర షిండే అనే వ్యక్తి కొట్లాట ఆపడానికి ప్రయత్నిస్తుండగా, ఎవరో విసిరిన ఒక పెద్ద రాయి తలకు తగిలి, అతను అక్కడికక్కడే చనిపోయాడు.    

29. ముస్లిం గుంపు దాడితో మత కలహాలు 
ఝార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్ జిల్లా టోప్చాచి తాలూకా మదైదిహ్ గ్రామంలో 24 జూన్2019 తేదీన మరొక మతపరమైన హింసాత్మక సంఘటన చెలరేగింది. భీమలాల్ మహతో తన తల్లి అంత్యక్రియలు జరిపి, ఊరేగింపులో వెనక్కి తిరిగివస్తుండగా, స్థానిక మసీదు ముందు డోలు కొట్టకూడదని ముస్లిముల గుంపు అభ్యంతరo చెప్పారు. ఇరువర్గాల మధ్య కొట్లాట ప్రారంభమై, కర్రలు ఇటుకలతో ఊరేగింపుపై దాడి చేసారు. మహతో `ఇతర వర్గం’పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.   

30. ముస్లిముల చేతిలో గంగారాం హత్య
ఉత్తరప్రదేశ్ పిపిలి-ఉమర్పూర్ దిలారి గ్రామంలో, తన మైనర్ కూతురి అపహరణ గురించి పోలీస్ స్టేషన్లో, తన పక్కింటి మనిషి `డానిష్’ మీద ఫిర్యాదు చేసిన కారణంగా,  19 జూన్ 2019 తేదీన, 54సం గంగారాంను ముస్లిం గుoపు చితకకొట్టి హత్య చేసింది. తరువాత అపహరించింది నదీం అనే వ్యక్తి అని తెలిసింది, ఆమె జాడ తెలుసుకుని, నదీం ఇంటిముందు ధర్నా చేసిన తరువాత, ఆమె దొరికింది. కానీ ఈ లోపే డానిష్ బంధువులు గంగారాంను కర్రలతో కొట్టారు. దగ్గరున్న హాస్పిటల్ తీసుకెళ్ళేలోపే అతను చనిపోయాడు.     

31. ప్రేమ- జిహాద్, మీరట్
మైనర్ హిందూ బాలిక లత (పేరు మార్చబడింది)4మే 2019 తేదిన, ఉత్తరప్రదేశ్ మీరట్ బ్రహ్మపురి తన ఇంటినుంచి మాయమైపోయింది. పొలీసులు అమెకొరకు ఒక నెల వెతికిన తరువాత, ఆమె ప్రయాగరాజ్ లోని హోటల్ గదిలో బంధింపబడి కనిపించింది. ఆమెని ముందు దేయోబoద్.కి తీసుకెళ్ళి, బలవంతంగా మతం మార్చి, ప్రయాగరాజ్లో పెళ్లి చేసుకుని, కొంతకాలం హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చండీగఢ్ హోటళ్ళలో బలవంతంగా ఉంచారని ఆమె చెప్పింది. ఆమెని అపహరించి తీసుకెళ్ళిన ముస్లిం యువకులు, అరెస్ట్ గురించి భయపడి ముందస్తు బేయల్ కోసం ఉత్తరప్రదేశ్ న్యాయస్థానo వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేసారు.       

32. 500మంది ముస్లిం గుంపు, గుణా పోలీస్ స్టేషన్ పై దాడి
ఒక పోలీసు అధికారి కూతురి `ప్రేమ-జిహాద్’ లాగా కనిపిస్తున్న అపహరణ నేరం కింద, మధ్యప్రదేశ్  గుణాలో, యూసుఫ్ ఇమ్రాన్ ని పోలీసులు అరెస్ట్ చేయగా, అతని బంధువులు ఇతరులు 500మంది పైగా ముస్లిం గుంపు గుణా పోలీస్ స్టేషన్ పై, దిగ్బ్రాంతికరoగా 23 జూన్ 2019న భయంకరమైన దాడి చేసారు. ఇమ్రాన్ ని వెంటనే విడుదల చేయాలని ఈ గుంపు గొడవ చేసారు.  

33. ప్రేమ-జిహాద్, మీరట్, 2017
హిoదువునని తన పేరు అమర్ అని చెప్పి, ఉత్తరప్రదేశ్ మీరట్ నంగ్లచాండ్ గ్రామానికి చెందిన అమిరుద్దీన్, మీరట్ లో ఒక హిందూ అమ్మాయితో రెండు నెలలు ప్రేమాయణం సాగించాడు. ఒకసారి తన స్నేహితుడు వసీమ్ తో పాటు ఆ అమ్మాయిని సినిమాకి తీసుకెళ్ళి, ఆమెని బలాత్కరించి, బైక్ మీద తీసుకుని పారిపోయారు. ఆమె గట్టిగా సహాయంకోసం అరవగా, దారిలో వెళ్తున్నవాళ్లు, వారిని పట్టుకుని హస్తినాపూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సబ్-ఇన్స్పెక్టర్ భరత్లాల్ షా, ఆ అమ్మాయికి వైద్య పరీక్ష చేయించి బలాత్కారం జరిగిందని ధ్రువీకరించారు.

34. ప్రేమ- జిహాద్, బలవంతపు మతమార్పిడి, పశ్చిమ బెంగాల్
ఈ సంవత్సరం 2019 పశ్చిమ బెంగాల్లో, ఇద్దరు హిందూ యువతులను- ఒకామె మైనర్ కూడా, బలవంతంగా మతమార్పిడి చేసి, ముస్లిం యువకులతో పెళ్లిచేసిన ఉదంతం కలకత్తాలో బయటపడింది. అంతకుముందే, ముస్లిం యువకులు తమ ప్రాంతంలో హిందూ యువతుల మీద కన్నేసి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారని ఆ యువతుల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసారు. అప్పుడు హిందూ యువతులను మతం మార్చి పెళ్లి చేసుకుంటామని, ఆ యువతులను వారి కుటుంబాలని చంపేస్తామని, ఆ ముస్లింలు బెదిరించారని, ఆ యువతుల తండ్రి చెప్పారు. పోలీసులు ఇద్దరు అక్కాచెల్లెళ్ళలో, మైనర్ చెల్లెల్ని మాత్రమే వెనక్కి తీసుకురాగలిగారు. ఆ అమ్మాయి, వారిద్దరి భయంకరమైన అనుభవాన్ని అందరికి తెలియచేసింది.  తమకు బలవంతంగా మతమార్పిడి చెయడమే కాక, పెళ్లి జరగకపోతే తమ తల్లిదండ్రులు అన్నని చంపేసి, తమపై ఆసిడ్ దాడి చేస్తామని బెదిరించారని ఆ యువతి చెప్పింది. ఇంకా ఆమె సోదరి జాడ తెలియట్లేదు.  

 35. ప్రేమ జిహాద్, యువతి హత్య, పశ్చిమ బెంగాల్, 2018
35సం శుభలగ్న చక్రబర్తి, పేరు మార్చుకుని తాను హిందువునని ఆమెకి చెప్పిన సుల్తాన్ ను, అతని మోసం తెలియక ప్రేమించింది. వారిద్దరూ రిజిస్టర్ పెళ్లి చేసుకునేముందు, ఆమె తల్లిదండ్రులకి సుల్తాన్ మోసం గురించి తెలిసి, పెళ్లి ఆపుచేసారు. సుల్తాన్ వెంటనే, ఆమె ఇంటికి దూసుకెళ్లి, శుభలగ్నని కాల్చి హత్య చేసాడు.    

36. ప్రేమ జిహాద్, యువతి ఆత్మహత్య, కోయంబత్తూరు
శ్రీ నారయణగురు కాలేజీలో బి కాం. మొదటి సంవత్సరం చదువుతున్న అశ్వినీ గంగ అనే యువతి, కోయంబత్తూరు కునియముత్యుర్ తన ఇంట్లో, 25ఏప్రిల్2019 తేదీన ఆత్మహత్య చేసుకుని మరణించింది. జాఫర్ అనే ముస్లిం విద్యార్థి, ఆమెని ప్రేమించానని వెంటపడుతూ, ఫోన్ ఎసెమెస్లు పంపిస్తూ ఆమెని వేధిస్తున్నాడు. ఆమె భయపడి కాలేజికి కూడా వెళ్ళడం మానేసి, ఫోన్లు ఎత్తక తప్పించుకుని ఇంట్లో ఉంటోంది. అప్పుడు అతను ఫోన్లో బెదిరింపు ఎసెమెస్లు పంపడం ప్రారంభించాడు. ఆ రోజు జాఫర్ ఆమె ఇంటికి వచ్చి, మతం మార్చుకోమని ఒత్తిడి చేస్తూ, ఈ విషయం ఎవరికైనా చెప్తే ఆమె తల్లితండ్రులను చంపేస్తానని బెదిరించాడు, ఈ వేధింపు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంటూ తన ఆత్మహత్యా పత్రంలో ఇదంతా వ్రాసింది. ఆమె తండ్రి గoగాధరన్, పోలీసులు ఆమె ఆత్మహత్యా పత్రాన్ని కావాలని దాచిపెట్టి, ఇంతవరకూ జాఫర్ పై ఎటువంటి చర్య తీసుకోలేదని విలపిస్తూ చెప్పారు. ఆత్మహత్యకి దారితీసిన ఈ ప్రేమ-జిహాద్ నేరంపై కోయంబత్తూరు పోలీస్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.        

37. ప్రేమ-జిహాద్, మీరట్ – దళిత స్త్ర్రీ పై సామూహిక అత్యాచారం
ఇక్బాల్ కొడుకు బిట్టు అనే ముస్లిం యువకుడు తన వెంట పడి ప్రేమ పేరుతో మతం మార్చుకోమని బలవంతం చేస్తూ వేధిస్తున్నాడని, 18డిసెంబర్2017 మధ్యాహ్నం, అతను అతని స్నేహితులు తనని బెదిరించి అపహరించారని, వారంరోజులు తనమీద సామూహికంగా అత్యాచారం జరిపారని, ఒక అశ్లీల వీడియో కూడా తీసారని, ఉత్తరప్రదేశ్ మీరట్ జనవరి2018లో, ఒక దళిత స్త్రీ పేర్కొంది. ఆమె మాయమైన తరువాత ఆమె కుటుంబం, మెవానా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసారు. 25డిసెంబర్ తేదీన, మీరట్-మేవానా రోడ్డుమీద ఆమె సగం స్పృహ లేని స్థితిలో కనిపించింది, ఆమె కుటుంబం ఆమెని ఇంటికి తీసుకెళ్ళారు.    

38. దళిత యువకుడి దారుణ హత్య
అప్పటికే పాడవుతున్న 21సం సంజయ్ కుమార్ శవం, 21ఆగస్ట్ 2018 ఢిల్లీలో కనపడింది. అతనికి ముస్లిమ్ యువతి రుఖ్సార్ కి పెళ్ళయిన తరువాత, ఆమె కుటుంబం, ముఖ్యంగా సలీం, ఎంత ఒత్తిడి చేసినా సంజయ్ కుమార్ మతం మారడానికి ఒప్పుకోలేదు. అతనిని ఎంత చిత్రవధ చేసి హింసాత్మకoగా చంపారో, స్వరాజ్య పత్రిక ప్రచురించిన అతని పోస్ట్-మోర్టెం రిపోర్ట్ బయటపెట్టింది. అతని శరీరంలో ఊపిరితిత్తులు, మలద్వారం, పురుషాంగం, కనుగుడ్లు, పళ్ళు ఊడిపోయి లేక మాయమైయాయి. `ఓం’ అని పచ్చబొట్టు ఉన్న భాగంతో సహా, చర్మం పలుచోట్ల ఒలచబడి, కాల్చబడి ఉంది. కట్టేసి కొట్టినట్లుగా రిపోర్ట్ ధృవపర్తుస్తోంది. రుఖ్సార్  సంజయ్ లను విడదీసినందుకు, ఆమె తల్లి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ, తన `కూతురు భవిష్యత్తులో దహనం కాకుండా కాపాడబడింది’ అని అన్నమాట పక్కిoటి మహిళ సునీత చెప్పింది.   

39. ఉత్తరప్రదేశ్లో సాధువుల దారుణ హత్య
ఉత్తరప్రదేశ్ అలీగడ్ పోలీసులు, అతి దారుణమైన కుట్ర మరియు హత్యల వివరాలు 2018లో వెల్లడిచేసారు. అరుగురు వ్యక్తులు, దానిలో ముగ్గురు సాధువుల హత్యల నేరంపై, పోలీసులు సబీర్ అలీ ఇంకో నలుగురిని అరెస్ట్ చేసారు. సబీర్ అలీ మతం మారకముందు అతని పేరు దినేష్ ప్రతాప్ సింగ్. ఇతని కొడుకు నదీమ్ ఇంకా ఇర్ఫాన్, సల్మాన్, యాసీన్ 2016 ఒక హత్య కేసులో నిందితులు. అందుకని అలీ ముఖ్య సాక్షులు హాజి కేసర్, జాన్ మొహమ్మద్, ఫిరోజ్, షోయాబ్ లను ఈ కేసులో ఇరికించారు. రాష్ట ముఖ్యమంత్రి యోగి కాబట్టి, సాధువులను హత్య చేస్తే, పత్రికలు దుమ్మెత్తి పోసి, పోలీసులు త్వరగా దర్యాప్తు చేస్తే, అలీ మీద ఉన్న కేసు బలహీనమౌతుoదని కుట్ర పన్ని సాధువులను హత్య చేసారు.    
40. గోహత్య వ్యతిరేకించిన ఇద్దరు సాధువుల హత్య
ఉత్తరప్రదేశ్ ఆరయా జిల్లా బిదునా ప్రాంతంలో కుందర్కోట్ గ్రామంలో 14-15 ఆగస్ట్ 2018లో లజ్జారాo యాదవ్, హరభజన్  అనే ఇద్దరు సాధువులను, గుర్తు తెలియని వ్యక్తులు, భయానక్.నాథ్ ఆలయ ప్రాంగణంలో, మంచానికి కట్టేసి, కత్తితో పొడిచి హత్య చేసారు, ఇంకొక సాధువు రామశరణని తీవ్రంగా గాయపరిచారు. ఈ హత్యలతో ఆ ప్రాంతమంతా హింస, తీవ్ర ఉద్రిక్తత పాలైంది.  సాధువులు గోహత్యలను వ్యతిరేకించడమే దీనికి కారణం అని పోలీసుల అంచనా.    

41. ప్రేమ జిహాద్, వడోదరా
వడోదర మంజల్పూర్ లో 19సం తౌసిఫ్ ఇమ్రాన్ ఖాన్,14సం. పదవ తరగతి చదివే బాలికను మళ్ళి మళ్ళి బలాత్కరించి, మొబైల్ ఫోనులో వీడియో కూడా తీసాడు. అతను ఆమెని మతమార్పిడి చేయడానికి ఎంతో ప్రయత్నించి, ఎన్నో మతపరమైన స్థలాలకి కూడా తీసుకెళ్ళాడు.  `లైంగిక హిoస నుంచి పిల్లల పరిరక్షణ(POCSO)చట్టం’ కింద మైనర్ బాలికపై అత్యాచారం చేసినందుకు ఇమ్రాన్ ఖాన్ మీద కేసు పెట్టారు. అతను ఆ అమ్మాయిని లాల్బాగ్ తోటకి, ప్రతాపనాగ్ లోని ONGC వద్దకు తీసుకెళ్ళి లైoగికంగా ఉపయోగించుకునేవాడని పోలీసులు తెలిపారు. ఆమెని బలవంతపెట్టి ఇదంతా ఫోటోలు, వీడియోలు తీసేవాడని అమ్మాయి తల్లిదండ్రులు చెప్పారు. అతను కొన్ని ఫోటోలు  టిక్-టాక్ ద్వారా స్నేహితులకి షేర్ చేసేవాడు, అమ్మాయి తల్లిదండ్రులు అతన్ని నిలదీసినప్పుడు మరింత అసభ్యకరమైన ఫోటోలు షేర్ చేస్తానని బెదిరించాడని పోలీసులు తెలిపారు. ఇతను అంతకుముందు 2017లో కూడా మైనర్ బాలిక మీద లైంగిక వేధింపు కింద POCSO చట్టం కింద నేరస్తుడే. 

42. మత ఉద్రిక్తత రేకెత్తిoచడానికి గోహత్య 
ఇమ్రాన్ తన స్నేహితులు పర్వేజ్, లుక్మాన్, ఇన్శాల్లాహమ్, ఢిల్లీలో హిందూ-ముస్లిముల మధ్య మత కలహాలను సృష్టించాలని, 2019లో హోలీ పండుగ రోజు, హర్షవిహార్ ప్రాంతంలో కావాలని గోహత్య చేసానని, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారుల విచారణలో ఒప్పుకున్నాడు. అతనికి అంతకుముందు కూడా నేరచరిత్ర ఉందని, విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.   

43. ముస్లిం గుంపు దళితుల మీద దాడి
బిహార్ బేగుసరాయ్ బరౌనీ తెహసిల్ నూర్పూర్ గ్రామంలో, 10 జూన్ 2019న ఒక ముస్లిం గుంపు మహాదళిత కుటుంబంపై దాడి చేసి, ఇద్దరు స్త్రీలపై లైంగికంగా దాడి చేసారు, ఒక వ్యక్తిని హత్య చేయడానికి ప్రయత్నించారు. స్వరాజ్య పత్రిక పరిశోధనలో కొన్ని నిజాలు బయటపడ్డాయి- ముస్లిములు అంతకుముoదునుంచీ,  ఇల్లు అమ్మి ఆ ప్రాంతాన్ని వదిలిపోమ్మని ఆ దళిత కుటుంబాన్ని బెదిరిస్తున్నారు, అక్కడ కొందరే హిందువులు ఉన్నారని వారూ ఏమి చేయలేరని, `బజరంగ్ దళ్ కూడా మీకు సహాయం చేయలేరు’, అని బెదిరించి, వారు వినకపోయేసరికి దాడికి దిగారు.  

44. ముస్లిం గుంపు పెట్రోల్ పంప్, అక్కడి సిబ్బందిపై దాడి, డబ్బు దోపిడీ
ముంబై మలాడ్ ప్రాంతంలో, ఒక ముస్లిం గుంపు సచదేవ పెట్రోల్ పంప్ ధ్వంసం చేసి, అడ్డొచ్చిన సిబ్బందిపై దాడి చేసారని, జాహీద్, జావేద్, సిరాజ్, ఫిరోజ్, అబ్దుల్ అనే వ్యక్తులమీద  ఎఫ్ఐఆర్ నమోదైంది. బైక్ మీద వచ్చిన ఇద్దరు పెట్రోల్ వెంటనే పోయమని తొందర చేస్తే, అక్కడి సిబ్బంది వారిని అందరిలాగే లైన్లో రమ్మని చెప్పారు. నమాజ్ ఆలస్యం అయిందని కోపంతో, వారిద్దరూ మరో 20మందితో తిరిగొచ్చి పంప్ నాశనం చేసి, సిబ్బందిని కొట్టి, రూ. 35000 దోచుకున్నారు.  

45. బజరంగ్ దళ్ కార్యకర్తలపై దాడి, ముస్లిం గుంపు పోలీసులపై దాడి
ఉత్తరప్రదేశ్ షామ్లి జూన్2019లో, మోమోలు తినడానికి కొందరు ముస్లిములు సాజిద్, ఆబిద్, తౌఫిక్, షామ్లి అజుధ్య చౌక్ కి వెళ్ళారు. అక్కడున్న ఇద్దరు బజరంగ్ దళ్ కార్యకర్తలు హిమాంశు హర్షలకి, ముస్లిములకి మధ్య మోమోల మీద వాదన మొదలైంది. వెంటనే ఇతరులు వచ్చి చేరాక ముస్లిం గుంపు పెద్దదైoది, వారు కార్యకర్తలని విపరీతంగా కొట్టి తీవ్రంగా గాయపరిచారు. చుట్టుపక్కల వాళ్ళు పోలీసులను పిలవగా, వారు ముస్లిం యువకులను అరెస్ట్ చేస్తే, ముస్లిం గుంపు పోలీసులపై దాడికి దిగి, ముస్లిం యువకులను తప్పించేసారు.          

46. ముస్లిం గుంపు హిందూ దుకాణాల యజమానులపై తీవ్రంగా దాడి, ఒకరి హత్య
ఉత్తరప్రదేశ్ మథురా నగరంలో, ఎన్నో చిన్న చిన్న దుకాణాలతో రద్దీగా ఉండే చౌక్ బజార్లో (మథురా శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయానికి ఇది చాలా దగ్గర), ప్రసిద్ధి పొందిన `నత్త్హ్హో యాదవ్ లస్సీవాలే’ లస్సీ దుకాణానికి ఒక బురఖా ధరించిన మహిళ 18మే 2019 తేదిన వచ్చిoది, చిన్న విషయానికి ఎదో వాదన జరిగింది. స్వరాజ్య పత్రిక `స్వాతి గోయల్ శర్మ’ గారి పరిశోధన ప్రకారం, వెంటనే ఆ ముస్లిం స్త్రీ ఒక పెద్ద ముస్లిం గుంపుతో పగ తీర్చుకోవడానికి తిరిగివచ్చి వారిని కొట్టమని చెప్పింది. పక్కపక్కన దుకాణాలు ఉన్న ఆ ఇద్దరు సోదరులు పంకజ్ యాదవ్, భరత్ యాదవ్.లపై బడి ఆ గుంపు దుకాణాలు ధ్వంసం చేయడమే కాక, ఆ సమయంలో దుకాణం చూస్తున్న అన్నదమ్ములనిద్దరినీ చితకబాదారు. బురఖా స్త్రీ వారిద్దరినీ `కాఫిర్లు’ (అనగా `ముస్లిమేతరులు’) అని దూషించింది. సోదరులిద్దరికీ శరీరం మీద తగిలిన గాయాలకి కట్లు కట్టించినా, పెద్దన్న అయిన భరత్, అంతర్గతంగా తగిలిన బలమైన గాయాలకి, వారం తర్వాత  మే24 తేదీన బలైపోయి మరణించాడు. మెదడుకి, నాడీ వ్యవస్థకి తీవ్ర గాయాలై భరత్ యాదవ్ మరణించాడని పోస్ట్-మోర్టెం నివేదిక వెల్లడించింది.       

47. ముస్లిం గుంపుచే దేవాలయం ధ్వంసం
ఉత్తరప్రదేశ్ పిల్భిట్ జిల్లా రోహాన్యా గ్రామంలో, ఈద్ పండుగ రోజున, ఒక దేవాలయంనుంచి లౌడ్ స్పీకర్లలో భజనలు వినిపిస్తున్నాయని,  ఒక పెద్ద ముస్లిం గుంపు దేవాలయాన్ని చేరుకొని, గుడి ధ్వంసం చేసి, దేవతా విగ్రహాలను పెకిలించి తీసుకుపోయారు. మెహబూబ్, మొనిస్, ఇస్రాయెల్, ఆజాద్, ఆలనూర్ అనే ఐదుగురిని పోలీసులు `మతవిద్వేషాలు రెచ్చగొట్టే’ ప్రయత్నం చేసారని కేసు నమోదు చేసారు. 

48. గోహత్య కేసులో పోలీసులపై ముస్లిం గుంపు దాడి
ఝార్ఖండ్ రాష్టంలో, గోమాంసం కనిపించిందని చాలా చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ రాష్టంలో గోహత్య నిషేధం. ఈ విషయం తెలుసుకుని పోలీసులు అక్కడికి చేరుకోగానే, గుంపులుగా చేరిన జనం, పోలీసుల మీద బాంబులతో దాడి చేసారు. ఇంకొక సంఘటనలో రాజధాని రాంచీ బాగ్డై ప్రాంతంలో, బహిరంగంగా ఒకచోట గోవధ జరుగుతోంది.  విషయం తెలుసుకుని పోలీసులు వెళ్ళేలోపు, గోహత్య జరిగిపోయింది. పోలీసులు బషీర్ అన్సారీని అరెస్ట్ చేసారు, వెంటనే అక్కడ చేరిన గుంపు పోలీసులను ఘేరావు చేసి చుట్టుముట్టి, పోలీసులమీద రాళ్ళు రువ్వి, పాకిస్తాన్ నినాదాలు చేసారు. మతపరమైన ఉద్రిక్తత పూర్తిగా ఉండడంతో, ప్రభుత్వం `రాపిడ్ ఏక్షన్ ఫోర్సు’ ని రప్పించారు. పరిస్థితి నియంత్రించడానికి రెండు డజన్లమందిని అరెస్ట్ చేసి, బెంగాల్-ఝార్ఖండ్ సరిహద్దుని సీల్ చేసి మూసేశారు.

49. అక్రమ గోవధ-శాల యజమానులు విలేఖరి పైన దాడి  
కర్ణాటక రామనగర్ జిల్లా కొడిపాల్యా గ్రామంలో, జంతుసంక్షేమ కార్యకర్తలు అక్రమoగా నడుపుతున్న గోవధశాలను చూసారు, అక్కడ వారికి గోవులు, దూడల ఎముకలు, పుర్రెలు, శరీర భాగాలు, రక్తపు మడుగులు కనిపించాయి. అక్కడ ప్రతిరోజూ 200 నవజాత దూడలను వధిస్తుంటారు. ఇది జంతు సంక్షేమ కార్యకర్తలు- పోలీసులు జరిపిన గాలింపు చర్యల్లో బయటపడింది. జంతు-హక్కుల కార్యకర్త జోషిన్ ఏoధోనీ కూడా అప్పుడు అక్కడే ఉన్నారు. అధికారులు ఉన్నప్పటికీ, అప్పుడు అక్కడి పరిస్థితి ఎంతో భయానకంగా, ప్రాణాoతకంగా మారింది. పెద్ద ముస్లిం గుంపు అక్కడికి చేరుకొని కార్యకర్తలను, ఇండియా టుడే పత్రికా విలేఖరిని, ఇతరులను రాళ్ళతో కొట్టడం ప్రారంభించారు. ఈ ముస్లిం గుంపు, విలేఖరి ఫోన్ పగలగొట్టి, అందరినీ బెదిరించారు. పోలీసులు నోరు మెదపకుండా ఉండిపోయారు. గోమాంసం మాఫియాకి, పోలీసులకి మధ్య ఎదో అవగాహన ఉందని కొందరు పేర్కొన్నారు, ఎందుకంటే పోలీసులకి అక్రమ గోవధశాల గురించి సమాచారం కార్యకర్తలు అందించగానే, ఆ సమాచారం వెంటనే అందరికీ చేరిపోయింది. రామనగర్ జిల్లాకే చెందిన ఘాజిపీర్, సయెద్, ఖాసి, ముబారక్ ఖాన్, నూర్, ఇంతియాజ్, తబ్రేజ్ మొదలైన ఏడుగురు గూoడాల మీద  IPC సెక్షన్లు 428, 429 (జంతు సంహరణ ద్వారా అల్లర్లు సృష్టించడం) కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. 

50. ప్రేమ-జిహాద్, బొకారో
ఝార్ఖండ్ బొకారో జిల్లాలో, తన అత్త-మామలు పెట్టిన హింస తర్వాత కూడా మతమార్పిడికి అంగీకరించని ఒక హిందూ యువతిని నవంబర్ 2017లో దారుణంగా బలాత్కరించి హత్య చేసారు. ఆ యువతి 6నవంబర్2017 తేది నుంచి కనపడట్లేదని రిపోర్ట్ చేయబడింది. తర్వాత బొకారో పట్టణంలోని గర్నానది  నుంచి కాళ్ళు చేతులు కట్టివేయబడిన ఆమె శవం దొరికింది. పోస్ట్-మోర్టెం నివేదికలో ఆమె మొదట బలాత్కరణకి, తర్వాత హత్యకి గురైనదని వెల్లడించబడింది. ఈ కేసులో పోలీసులు వెంటనే విచారణ చేసి, ఆమె భర్త ఆదిల్ అన్సారీని అరెస్ట్ చేయగా, అతను జరిగిన దారుణం చెప్పాడు. 

సౌజ‌న్యం : opindia.com