Home News ప్రేమించిన యువతిని గొంతు కోసి హత్యచేసిన షాహిద్ 

ప్రేమించిన యువతిని గొంతు కోసి హత్యచేసిన షాహిద్ 

0
SHARE

వరంగల్: హన్మకొండలోని రాంనగర్‌లో ఒక షాహిద్ అనే ప్రేమోన్మాది ప్రియురాలిని దారుణంగా హత్యచేశాడు. హన్మకొండ మండలం లష్కర్‌ సింగారానికి చెందిన హారతి(24) అనే యువతి రామ్‌నగర్‌లో తన అక్క ఇంటివద్ద ఉంటూ ఎం.బి.ఎ చదువుతున్నది. డిగ్రీ చదివేరోజుల్లో కాజీపేట విష్ణుపురికి చెందిన షాహిద్‌(23)తో పరిచయమేర్పడింది.  షాహిద్‌ కుటుంబం విష్ణుపురికాలనీలో మటన్‌షాపు నిర్వహిస్తుండగా అతడు ఆటో నడుపుతున్నాడు. రాంనగర్‌లో తన సోదరుడు ఖాళీచేసిన ఒక ఇంటికి షాహిద్‌ తరుచూ హారతిని తీసుకుని వెళ్ళేవాడు. అయితే ఈ మధ్య హారతికి పెళ్ళి నిశ్చయమైన విషయం తెలిసినప్పటి నుంచి షాహిద్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. మాట్లాడాలని చెప్పి శుక్రవారం మధ్యాహ్నం హారతిని  ఆ ఇంటికి పిలిచాడు. అక్కడికి వచ్చిన హారతితో గొడవపడి, తనతో పాటు తీసుకొచ్చిన కత్తితో ఆమె గొంతుకోసి హతమార్చాడు. అక్కడి నుంచి రక్తపుమరకలతో ఇంటికెళ్లి బట్టలు మార్చుకుని ఆ తర్వాత సుబేదారి పోలీసులకు లొంగిపోయాడు.

నగర పోలీస్‌కమిషనర్‌ విశ్వనాథ్‌ రవీందర్‌ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.