Home News స్వదేశీ  అంటే శాంతి, శ్రేయస్సు, భద్రతను రక్షించే ఒక గొప్ప తపస్సు: ఆర్.ఎస్.ఎస్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య  

స్వదేశీ  అంటే శాంతి, శ్రేయస్సు, భద్రతను రక్షించే ఒక గొప్ప తపస్సు: ఆర్.ఎస్.ఎస్ సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య  

0
SHARE
స్వదేశీ అనేది ఒక నినాదం లేదా కేవలం ప్రచారం కాదని, ఇది శాంతి, శ్రేయస్సు మరియు భద్రతను ప్రోత్సహిస్తూ, పర్యవరణాన్ని రక్షించే ఒక గొప్ప తపస్సు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  మాననీయ సహ సర్ కార్యవాహ శ్రీ వి.భాగయ్య జీ అన్నారు.
30 జూన్ న హైదరాబాద్ లోని సంఘ కార్యాలయంలో స్వదేశీ స్వావలంబన్ అభియాన్ సమన్వయకర్త శ్రీ సతీష్ కుమార్ వ్రాసిన పుస్తకాలు ‘స్వదేశీ స్వావలంబన్ కి ఓర్  భారత్’ (హిందీ) మరియు ‘ఇండియా మార్చింగ్ టువర్డ్స్ స్వదేశీ అండ్ సెల్ఫ్ రిలయన్స్’ (ఇంగ్లీష్) ఆన్‌లైన్లో విడుదల చేసిన సందర్భంగా ప్రసంగిస్తూ శ్రీ భాగయ్య జీ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా శ్రీ భాగయ్య గారు మాట్లాడుతూ.. “అభివృద్ధి పథంలో, ఆర్థిక రంగంలో ముందుకు దూసుకపోవడానికి మరియు మానవుల అవసరాలను తీర్చడానికి ప్రకృతిని విచక్షణా రహితంగా దోపిడి చేసే సిద్ధాంతాలు సృష్టించబడ్డాయి. ఇందు మూలంగా ప్రపంచం, అపనమ్మకం, అరాచకం మరియు అసంతృప్తిని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం, ఇటువంటి సంక్షోభ భరిత వ్యవస్థ నుండి పూర్తిగా బయటకు రావడానికి ప్రపంచం అడుగులు వేస్తోంది” అన్నారు.
ప్రకృతి విధ్వంసపూరిత అభివృద్ధి నమూనాను మార్చడానికే, స్వదేశీ స్వావలంబన ఉద్యమాన్నిదేశం మొత్తంలో స్వదేశీ జాగరణ మంచ్ ప్రారంభించినట్లు శ్రీ భాగయ్య జీ తెలిపారు. సంఘ భావజాల సంస్థలతో పాటు, గాయత్రీ పరివార్, జగ్గీ వాసుదేవ్ జీ మహారాజ్, శ్రీ శ్రీ మరియు అనేక ఇతర సంస్థలు ఈ ప్రచారాన్ని తమ ప్రచారంగా భావించి ముందుకు సాగుతున్నాయి అని అన్నారు.

ఏప్రిల్ 26 న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పూజ్య సర్ సంఘచాలక్ గారు కూడా స్వదేశీ పిలుపునిచ్చారని అన్నారు. గడిచిన 250 సంవత్సరాలు మినహా, భారతదేశం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతున్న గ్రామీణ ఆధారిత దేశంగా గొప్పగా వెలసిల్లింది. తెలంగాణ గ్రామాల నుండి ఇంగ్లాండ్‌కు ఉక్కు, బెంగాల్, తమిళనాడు గ్రామాల నుండి బట్టలు ఎగుమతి అయ్యేవని తెలియజేసారు. ఇటీవల, విజయవాడలోని ఒక సంస్థ 5 కోట్ల విలువైన ఆవు ఆధారిత ఉత్పత్తులను విజయవంతంగా ఉత్పత్తి చేసిందని శ్రీ భాగయ్య గారు వెళ్ళడించారు.

స్వదేశీ ప్రచారం యొక్క ముఖ్య లక్షం ఏమిటంటే గ్రామాలని కేంద్రీకృతం చేసుకొని  వ్యవసాయాన్ని అధారంగా ఉంచి అభివృధి పథంలో ముందుకు సాగడమేనని. అంతేకాక, స్వయం ప్రతిపత్తి మరియు స్వదేశీ పట్ల ప్రభుత్వ ఆలోచనలలో మార్పుతేవడం మరియు ప్రభుత్వ విధానాలలో ప్రతిబింబింపచేసే విధంగా చేయడమే స్వదేశీ యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు.

స్వదేశీ స్వావలంబన్ అభియాన్ (Swadeshi Self Reliance Campaign) ను మే 20, 2020 న స్వదేశీ జాగరణ మంచ్ ప్రారంభించింది. ఈ కార్యక్రమం యొక్క మొదటి దశలో, చైనా వస్థువులను బహిష్కరించడానికి డిజిటల్ సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో ఇప్పటికే 10 లక్షల మందికి పై చిలుకు డిజిటల్ సంతకం చేసి స్వదేశీ వస్తువులను మాత్రమే వాడుతామని ప్రతిజ్ఞ చేసారు మరియు ఈ సంఖ్య దిన దినం, వేగంగా పెరుగుతోంది.

వినియోగదారులలో స్వదేశీ మరియు స్వావలంబన మేల్కొలుపు మరియు నిబద్ధతను రేకెత్తించడమే ‘స్వదేశీ స్వావాలంబన్ అభియాన్’ యొక్క ముఖ్య లక్ష్యం. చిన్న తరహా పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు, చేతివృత్తులవారు, ఆహార తయారీ పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలు మరియు ఇతర వ్యవసాయేతర కార్యకలాపాలతో స్వదేశీ పరిశ్రమలలో చైతన్యం నింపడం ద్వారా స్వదేశీ స్వావలంబన సాధించబడుతుంది. మనం దేశంలోని దాదాపు 700 జిల్లాలకు స్వదేశీ ఉద్యమం ద్వారా చేరుకోవచ్చు. ఈ కాలంలో, టీవీ ఛానెల్స్, సివిల్ సొసైటీ సంస్థలు నిర్వహించిన సర్వేలలో, దేశంలోని దాదాపు ప్రతి ఒక్కరూ స్వదేశీని ఉపయోగించుకుంటామని మరియు చైనాకు సంబంధించిన ప్రతీ దానిని బహిష్కరిస్థామని ప్రతిజ్ఞ చేయడం మనం గమనించాం. ఆమోద మార్గాన్ని అనుసరించడం తప్పనిసరి చేయడం ద్వారా ప్రభుత్వం ఇప్పటికే చైనా పెట్టుబడులపై ఆంక్షలు విధించింది. ఆ తరువాత చైనా నుండి దిగుమతులపై అనేక ఆంక్షలు విధించిన తరువాత, చైనా కంపెనీల టెండర్లు పెద్ద సంఖ్యలో రద్దు చేయబడుతున్నాయి మరియు కొద్ది రోజుల క్రితమే భారత ప్రభత్వం 59 చైనీస్ యాపులపై నిషేధం విధించడం అందరికీ తెలిసిన విషయమే.

స్వదేశీ అభియాన్ ప్రారంభించిన ఈ ఒకటిన్నర నెలలో, చిన్న పరిశ్రమలలో చైతన్యం నింపే ఉద్దేశ్యంతో కార్మికులను, రైతులను, చిన్న తరహా పారిశ్రామికవేత్తలను, విద్యావేత్తలను, సాంకేతిక నిపుణులను, పరిశ్రమ మరియు వాణిజ్య నాయకులతో సహా అన్ని వర్గాల ప్రజలను ఈ అభియాన్ లో చేర్చే ప్రక్రియ ప్రారంభమైంది. వివిధ సంస్థల మరియు సంఘాల సహకారంతో, ప్రజలలోకి వెళ్ళి స్వదేశీ / స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడమే కాకుండా వాటికి సంభందించిన ప్రయోజనాల గురించి ప్రజలకు సవివరంగా వెళ్ళడించడం జరుగుతుంది. దీనికోసం, పరిశ్రమలకు చెందిన వ్యక్తులు, వ్యాపార వాణిజ్య వ్యక్తులతో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రపంచీకరణ యుగంలో నిర్లక్ష్యం చేయబడిన స్థానిక పరిశ్రమలను పునరుద్ధరించడానికి, సంక్షేమం, స్థిరమైన ఆదాయాలు, ఉద్యోగ కల్పనకు సహాయపడే మరియు మొత్తం మీద ప్రజలలో విశ్వాసం కలిగించే ఆర్థిక విధానాలను రూపొందించడానికి స్వదేశీ ఉద్యమం అత్యంత అనుకూలమైన సమయం.

దేశంలో 700 కి పైగా MSME క్లస్టర్‌లు ఉన్నాయి. ఈ సమూహాలకు పారిశ్రామిక అభివృద్ధి యొక్క సుదీర్ఘ  మరియు సంపన్న చరిత్ర ఉంది. చైనా నుండి అవినీతికర పోటీ మరియు దిగుమతుల కారణంగా ఈ పారిశ్రామిక సమూహాలలో చాలా మంది తమ ఉనికిని కోల్పోయారు. ఇటువంటి వారికి అన్ని విధాలుగా మద్ధతునివ్వడం తిరిగి వారి ఉనికిని చాటుకోవడానికి అన్ని రకాలుగ సహాయక చర్యలను అంధించడం ద్వారా వారు ఉపాధి అవకాశాలను సృష్టించటమే కాకుండా అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులను అత్యంత ఆర్థిక వ్యయంతో ఉత్పత్తి చేస్తారు. భవిష్యత్తులో ఉత్పాదక వృద్ధిని సాధించడానికి దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో ఇలాంటి మరిన్ని పారిశ్రామిక సమూహాలను గుర్తించడం జరుగుతుంది..

భారత్ స్వయం ప్రతిపత్తిలో గ్రామీణ హస్తకళలు మరియు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆహార తయారీ పరిశ్రమలు, కోళ్ళ, పాడి, చేపల, పుట్టగొడుగుల పెంపకం, వెదురు పెంపకం, ఫ్లోరి కల్చర్, హార్టికల్చర్ మరియు ఇతరత్ర పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. సమగ్ర గ్రామీణాభివృద్ధి దిశగా అడుగులు వేయడం మరియు సమగ్ర గ్రామీణ ఆర్థిక అభివృద్ధి గురించి అవగాహన కల్పించడమే స్వదేశీ స్వావలంబన ఉద్యమం యొక్క తక్షన కర్తవ్యం.

ఈ స్వదేశీ స్వావాలంబన్ అభియాన్ ద్వార స్థానిక, చిన్న తరహా తయారీదారులను, చేతివృత్తులవారిని మరియు చిన్న వ్యాపారాలను ఒక్క తాటిపైకి తెచ్చే అరుదైన సమయం ఇది. పరిశ్రమల సమస్యలను గుర్తించడానికి స్వదేశీ జాగరణ మంచ్ ఇప్పటికే అనేక క్లస్టర్ అధ్యయనాలు చేసింది. అనేక సందర్భాల్లో, స్వదేశీ జాగరణ మంచ్ యొక్క సహాయం వెళ కట్టలేనిది. ప్రస్తుత రోజులకు అనుగూణంగా, స్థానిక పరిశ్రమలను మరియు దేశీయ పరిశ్రమను పునరుద్ధరించడానికి ఇటువంటి మరిన్ని అధ్యయనాలు నిర్వహించబడతాయి.

గ్రామీణ ప్రాంతాలలో విజయవంతమైన ప్రయోగాలను పట్టణాలలో ప్రచురింపచేసి పట్టణ ప్రజలను కూడా ఆహార పరిశ్రమలు మరియు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల వినియోగం పట్ల అవగహన కల్పింప చేయడమే ఈ స్వదేశీ స్వావలంబన యొక్క ముఖ్య ఉద్దేశం.

ఈ కార్యక్రమంలో స్వదేశీ జాగరణ మంచ్ అఖిలభారత సంఘటక్ శ్రీ. కాశ్మిరిలాల్ గారు, పుస్తక రచయిత శ్రీ. సతీష్ కుమార్ గారు పాల్గొనగా, గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్ ప్రొఫెసర్ భగవతి ప్రకాష్ శర్మ పుస్తక పరిచయం చేయగా, స్వదేశీ జాగరణ మంచ్ అఖిలభారత కన్వేనర్ శ్రీ. సుందరం గారు వందన సమర్పణ చేసారు. ఈ కార్యక్రమంలో స్వదేశీ జరరణ మంచ్ అఖిలభారత అధికారులు దేశం మొత్తం నుండి ఆన్లైన్ లో పాల్గొన్నారు.