Home News రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పత్రికా ప్రకటన: తెలంగాణ ప్రాంతం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పత్రికా ప్రకటన: తెలంగాణ ప్రాంతం

0
SHARE

హైదరాబాద్, 31 అక్టోబర్, 2020: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దక్షిణమధ్య క్షేత్రకు సంబంధించిన రెండు రోజుల సమావేశాలు హైదరబాద్ అన్నోజీగూడాలోని శ్రీ విద్యావిహార పాఠశాలలో నేడు(31 అక్టోబర్) ముగిశాయి.

ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలకు చెందిన ప్రాంత సంఘచాలక్ (రాష్ట్ర అధ్యక్షులు)లు, ప్రాంత కార్యవాహలు(రాష్ట్ర కార్యదర్శులు), ప్రాంత ప్రచారకుల(రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శులు)తో కూడిన కార్యనిర్వహణ కౌన్సిల్ కు చెందిన 37మంది పదాధికారులు పాల్గొన్నారు.

ఈ రెండు రోజుల సమావేశాల్లో లాక్ డౌన్ సందర్భంగా సంఘ్ నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాల గురించి సమీక్ష జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ శాఖలు తిరిగి ఎలా ప్రారంభించాలన్న అంశాన్ని కూడా చర్చించారు. ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పదాధికారులు పర్యటనలు తిరిగి ప్రారంభిస్తారు.

సమావేశాల్లో ముగింపు ఉపన్యాసం చేసిన పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ జీ భాగవత్ మాట్లాడుతూ దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుతపు ప్రత్యేక పరిస్థితుల్లో వివిధ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలని ఉద్బోధించారు. విజయదశమి ఉత్సవంలో ప్రస్తావించినట్లుగా వివిధ రంగాల్లో స్వయంఉపాధి కల్పించడానికి కౌన్సిలింగ్, నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు.

శాఖల విస్తరణతోపాటు స్వయంసేవకులు కుటుంబ సమ్మేళనాలపై దృష్టి పెట్టాలని కోరారు. వారానికి ఒకసారి నిర్వహించే ఈ సమావేశాల్లో సామాజిక, పర్యావరణ అంశాలపై చర్చ జరపాలని సూచించారు.


తిప్పేస్వామి
క్షేత్ర కార్యవాహ,
దక్షిణమధ్య క్షేత్రం, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.


జారీ చేసినవారు:
ఆయుష్ నడింపల్లి
ప్రాంత ప్రచార ప్రముఖ్, తెలంగాణ
ఫోన్ నెం. 9848038857