Home News కరినగర్ : సేవా భారతి ఆధ్వర్యంలో వైద్య శిబిరం

కరినగర్ : సేవా భారతి ఆధ్వర్యంలో వైద్య శిబిరం

0
SHARE

కరినగర్ జిల్లా కేంద్రంలోని ఆరేపల్లి డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరీ కాలనీలో ఆదివారం సేవా భారతి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ ఈ.ఎన్.టి వైద్యులు, ఆర్.ఎస్.ఎస్ నగర సంఘచాలక్ రమణ చారి గారు, చర్మ వ్యాధి నిపుణులు రమేష్, వేవెక్ లు పాల్గొని తమ సేవలందించారు. ఈ శిబిరం లో మొత్తం 93 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఎస్ నగర కార్యవహా మురళీధర్, నగర సేవా ప్రముఖ్ మునిందర్, బస్తి ప్రముఖ్, శాఖ కార్యావహా జైసింహ రెడ్డి, బారి జితేందర్, వెంకటేష్, సందీప్, సంతోష్, నరేందర్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.