Home News “సిరివెన్నెల” కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త కార్య‌కారిణి స‌ద‌స్యులు శ్రీ వి.భాగ‌య్య‌

“సిరివెన్నెల” కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త కార్య‌కారిణి స‌ద‌స్యులు శ్రీ వి.భాగ‌య్య‌

0
SHARE

‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, భారతీయ తాత్విక చింతనా సాహితీ మూర్తి, దివంగత శ్రీ సీతారామశాస్త్రి గారి కుటుంబ సభ్యులను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ అఖిల భారత కార్యకారిణి సదస్యులు, శ్రీ భాగయ్య గారు కలిసి (డిసెంబర్ 7) పరామర్శించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అమ్మగారిని, వారి ధర్మపత్ని శ్రీమతి పద్మావతి గారిని, కుమారులు యోగేశ్వర సాయి, రాజా, ఇతర కుటుంబ సభ్యులందరిని కలిసి సానుభూతి వ్యక్తంచేశారు. సిరివెన్నెల గారి కుటుంబముతో గత మూడు దశాబ్దాల పైగా వున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సిరివెన్నెల గారు లేని లోటు పూరింపలేనిది అయినా కుటుంబ సభ్యులందరూ మనోధైర్యంతో ఉండాలని కోరారు.

శ్రీ భాగయ్య గారితో పాటు MGNCRE ఛైర్మన్, సంస్కృతి ఫౌండషన్ నిర్వాహక సభ్యులు,Dr. W G ప్రసన్న కుమార్, RSS తెలంగాణ ప్రాంత కార్యకారిణి సదస్యులు శ్రీ రాంపల్లి మల్లికార్జున్, శ్రీ కొంపెర్ల రామమూర్తి తదితరులు కూడా వున్నారు.