Home News పీఎస్‌ఎల్వీ సీ-45 విజయవంతం

పీఎస్‌ఎల్వీ సీ-45 విజయవంతం

0
SHARE

* నింగిలోకి 28 ఉపగ్రహాలు
* రోదసీలో డీఆర్‌డీవో రూపొందించిన నిఘా ఉపగ్రహం

నెల్లూరు: శ్రీహరికోటలోని ఇస్రోలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. పీఎస్‌ఎల్వీ సీ-45 నింగిలోకి సోమవారం ఉదయం అనుకున్న సమయానికి దూసుకెళ్లింది. ఇది ఇమిశాట్ సహా 28 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళుతోంది. పీఎస్‌ఎల్వీ సీ-45 ప్రయోగం సక్సెస్ అయినట్లు ఇస్రో సైంటిస్టులు వెల్లడించారు.

విదేశీ రాడార్లను పసిగట్టి సమాచారాన్ని అందించే నిఘా ఉపగ్రహాన్ని రాకెట్ రోదసీలోకి తీసుకెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని డీఆర్డీవో రూపొందించింది. 436 కిలోల బరువు ఉన్న ఈ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఇఎంఐఎస్‌ఏటీ (ఇమిశాట్)ను పీఎస్‌ఎల్వీ సీ-45 కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీనితో పాటు అమెరికాకు చెందిన 24 ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన 2, స్విట్జర్లాండ్, స్పెయిన్‌కు చెందిన ఒక్కో శాటిలైట్‌ను రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.

  కాగా పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెళుతుండగా ఓ విమాన పైలెట్ కాక్‌పిట్ నుంచి దాన్ని వీడియో షూట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో కూడా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆ పైలెట్  తీసిన వీడియోకు విశేష స్పందన వస్తుండగా, అదేరీతిలో ప్రయాణికుల భద్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతుండడం విశేషం.

Source: VijayaKranthi