Home News ఎన్నికల్లో రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న అభ్యర్థిపై ముస్లిం లీగ్ మతోన్మాదుల దాడి

ఎన్నికల్లో రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న అభ్యర్థిపై ముస్లిం లీగ్ మతోన్మాదుల దాడి

0
SHARE

కేరళ: వాయనాడ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థి తుషార్ వెల్లప్పల్లిపై అక్కడి ముస్లిం లీగ్ పార్టీకి చెందిన ఇస్లామిక్ అతివాదులు దాడికి పాల్పడ్డారు.

మలప్పురం జిల్లా వాన్దూర్ సమీపంలోని కలికాయు ప్రాంతంలో ఘటన జరిగింది.  ముస్లిం లీగ్ పార్టీకి చెందిన సుమారు రెండు వందల మంది ఇస్లామిక్ అతివాదులు తుషార్ వెల్లప్పల్లిపై దాడికి పాల్పడి అతని వాహనాన్ని సైతం ధ్వంసం చేశారు. ఘటనలో తుషార్ వెల్లప్పల్లి సహా మరికొందరు ఎన్డీఏ కార్యకర్తలు గాయాలపాలయ్యారు.
వాయనాడ్ నియోజకవర్గం ముస్లిం అతివాదులకు పట్టు ఉన్న ప్రాంతం కావడంతో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ ఇక్కడి నుండి పోటీ చేయడానికి నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

Source: Organiser