Home News బెంగూళూరులో ప్రారంభ‌మైన ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌తీయ‌ ప్ర‌తినిధి స‌మావేశాలు

బెంగూళూరులో ప్రారంభ‌మైన ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌తీయ‌ ప్ర‌తినిధి స‌మావేశాలు

0
SHARE

ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌తీయ ప్ర‌తినిధి స‌మావేశాలు మార్చి 19న ప్రారంభ‌మ‌య్యాయి. రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ స‌మావేశాల్లో మొద‌టి రోజు స‌మావేశాల‌ను రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ స‌ర్ ‌సంఘ‌చాల‌క్ ప‌ర‌మ పూజ్య‌నీయ శ్రీ మోహ‌న్ భాగ‌వ‌త్ గారు, స‌ర్ కార్య‌వాహ ప‌ర‌మ పూజ్య‌నీయ శ్రీ సురేష్ భ‌య్యాజీ జోషి గారు జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులుగా ఎన్నికైన వారితోపాటు రాష్ట్రాల కార్యదర్శులు(కార్యవాహ), అధ్యక్షులు (సంఘచాలక్), ప్రచారక్ లు ఇందులో పాల్గొన్నారు..