Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

ముసునూరు నాయకులు

ముప్పులన్నెదిర్చి ముసునూరునాయకుల్
మ్లేచ్ఛ జనులనుండి స్వేచ్ఛ నిచ్చి
కాపుగాసెనంట కాకతి రాజ్యంబు
వినుర భారతీయ వీర చరిత

భావము

ప్రతాపరుద్రుని అనంతరం కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్రమించిన తురక రాజుల అనుచరుల నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కొన్నారు. సామంత రాజులను ఏకం చేశారు. తురకలను పారద్రోలినారు. 30 సంవత్సరాల పాటు రాజ్యానికి కాపుగాసిన ముసునూరు నాయకులుగా పేరొందిన ప్రోలయ, కాపయ నాయకుల వీర చరిత తెలుసుకో ఓ భారతీయుడా!

-రాంనరేష్