Home News కేరళలో RSS కార్యాలయంపై బాంబు దాడి: కిటికీ అద్దాలు ధ్వంసం

కేరళలో RSS కార్యాలయంపై బాంబు దాడి: కిటికీ అద్దాలు ధ్వంసం

0
SHARE

దిగ్భాంతికరమైన రీతిలో కేరళలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) కార్యాలయంపై ఆగంతుకులు బాంబు దాడికి పాల్పడ్డారు. కన్నూరు జిల్లాలోని పయ్యనూర్‌లో మంగళవారం తెల్లవారుజామున RSS కార్యాలయంపై నాటుబాంబుతో దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

“కన్నూరు జిల్లాలోని పయ్యనూర్‌లో RSS కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న దాడిలో భవనం తాలూకు కిటికీ అద్దాలు పగిలిపోయాయి” అని పోలీసులు చెప్పారు.

10 సంవత్సరాల క్రితం CPM గూండాల చేతిలో అమరుడైన ఒక స్వయంసేవకుడి స్మత్యర్థం ‘బలిదాన యాత్ర’ చేపడుతున్న సందర్భంగా బాంబు దాడి చోటు చేసుకోవడం గమనార్హం. స్థానికుల ప్రకారం రూ.60 లక్షల విలువైన ధనరాజ్ అమరుల నిధి నిర్వహణలో అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి RSS కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ధనరాజ్ స్థానిక CPM నేత. పలు హత్య కేసుల్లో ధనరాజ్ నిందితుడు.

SOURCE: ORGANISER