Home News మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. 34 మంది మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. 34 మంది మావోయిస్టుల లొంగుబాటు

0
SHARE
లోక్ సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 34 మంది మావోయిస్టులు సుక్మా జిల్లా ఎర్రబోరు పోలీసు స్టేషన్లో ఎస్పీ ఎదుట లొంగిపోయారు. వీరిలో ముగ్గురు మహిళా మావోయిస్టు సభ్యులు ఉన్నారు. వీరంతా తమ ఆయుధాలు అప్పగించినట్టు సుక్మా జిల్లా ఎస్పీ డీఎస్ మారవి తెలిపారు. లొంగిపోయిన వారిపై గతంలో దాడిదోపిడీ, బలవంతపు వసూళ్లు, హత్యాయత్నం మొదలైన కేసులు ఉన్నాయి. వీరిలో 17 మందిపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది.
ఈ మధ్యకాలంలో ఇంతటి భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడంపై పోలీసులు హర్షం వ్యక్తం చేశారు.
Source: Organiser