Home News ఖమ్మంలో పారిశుద్ధ కార్మికులకు సన్మానం

ఖమ్మంలో పారిశుద్ధ కార్మికులకు సన్మానం

0
SHARE

సామాజిక సమరసత వేదిక ఖమ్మం వారి ఆధ్వర్యంలో గురునానక్ 550 వ జయంతి, గాంధీజీ 150 వ జయంతి, అంబేద్కర్ 63 వ వర్దంతి సందర్భంగా   చండ్ర చలపతిరావు ఫౌండేషన్ (చైర్మన్ చంద్రశేఖర్ తేజ)వారి సహకారంతో పారిశుద్ధ కార్మికులకు సన్మానం చేసి దుస్తుల పంపిణి చేయటం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ శ్రీ అప్పల ప్రసాద్ గారు మాట్లాడుతూ దేశం స్వచ్ఛ భారతం దిశగా వెళ్ళటానికి పారిశుద్ధ కార్మికుల అశేషమైన కృషి ఉందని కొనియాడారు. పారిశుద్ధ కార్యక్రమాలలో భాగంగా ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారని వాళ్ళని గుర్తు చేసుకున్నారు. వారి విశేషమైన సేవలకు గాను వారికి సన్మానం చేస్తున్నామని ఆయన అన్నారు. స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని తమ భుజాలపై వేసుకుని సమాజాన్ని నిత్య నూతనంగా తీర్చి దిద్దేందుకు అహర్నిశలు పారిశుద్ధ కార్మికులు పాటుపడుతున్నారని ఆయన అన్నారు. పారిశుద్ధ కార్మికుల కోసం ఏర్పాటు ఈ కార్యక్రమాన్ని ప్రసంగాలతోనే ఆపకుండా వారిని సత్కరించి గౌరవిస్తున్నాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో సమరసత వేదిక రాష్ట్ర కార్యదర్శి కీసర జైపాల్ రెడ్డి గారు, సమరసత వేదిక నగర కన్వీనర్ నుకల మోహన్ కృష్ణ గారు, చంద్ర శేఖర్ గారు, శంకర్ గారు, నవీన్ గారు, జమ్మి శ్రవణ్ గారు, సునీల్ గారు, విజయ రాజు గారు, కోటిరెడ్డి గారు, పెరుగు వెంకటరమణ గారు తదితరులు పాల్గొన్నారు……..