Home News కుంభమేళా చరిత్రలో మొట్టమొదటిసారిగా.. పుణ్యస్నానాలు ఆచరించిన ‘హిజ్రా’ అఖాడా సభ్యులు 

కుంభమేళా చరిత్రలో మొట్టమొదటిసారిగా.. పుణ్యస్నానాలు ఆచరించిన ‘హిజ్రా’ అఖాడా సభ్యులు 

0
SHARE
చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చిన ‘హిజ్రా’  బృందానికి అఖాడా గుర్తింపు దక్కింది. ప్రయాగరాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో హిజ్రాలకు చెందిన ‘కిన్నర్ అఖాడా’ బృందం పుణ్యస్నానాలు ఆచరించింది. ఈ సందర్భంగా కిన్నర్ అఖాడాకు చెందిన ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ కుంభమేళా చరిత్రలోనే ఇది మొట్టమొదటి ఘటన అని, ఈ ఘటన ద్వారా మేము కూడా ఈ సమాజంలో భాగమే అన్న బలమైన సందేశం అందరికి చేరుతుందని అన్నారు. తమ బృందాన్ని ‘లైంగిక పరిధులను అధిగమించిన అఖాడా’గా వ్యవహరిస్తున్నామని తెలిపారు. అఖాడాకు చెందిన ప్రధాన అర్చకురాలు ఆచార్య లక్ష్మీనారాయణ త్రిపాఠి ఈ సందర్భంగా మీడియాతో ఈ కుంభమేళాకు రావడం అనేది ఆధ్యాత్మిక దివ్యానుభూతినిచ్చిందని తెలిపారు.
Source: Organiser