Home News వివేకానందుడి కలలను సాకారం చేయటం కొరకే ఆర్ ఎస్ ఎస్ కృషి- భయ్యాజి జోషి

వివేకానందుడి కలలను సాకారం చేయటం కొరకే ఆర్ ఎస్ ఎస్ కృషి- భయ్యాజి జోషి

0
SHARE

స్వామి వివేకానంద 150 సంవత్సరాల క్రితం ఏ లక్షం కోసం తమ జీవితాన్ని సమర్పించారో అదే లక్షం సాధించడం కొరకు డా. హెడ్గెవార్ ఆర్ ఎస్ ఎస్ ను స్థాపించారని శ్రీ సురేష్ భయ్యా జి జోషి అన్నారు.

కొత్తపేట బాబు జగ్జీవన్ రామ్ భవనంలో బుధవారం జరిగిన సభలో ఆర్ఎస్ఎస్ కు నేతృత్వం వహించిన 5 గురు సర్ సంఘచాలకుల జీవిత చరిత్రతో కూడుకున్న పుస్తకాలను ఆవిష్కరించారు.

ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ శ్రీ భయ్యా జి మాట్లాడుతూ సర్వ సాధారణ నేపథ్యం కలిగిన కుటుంబాలలో జన్మించిన 5గురు సర్ సంఘచాలకులు అసాధారణ నేతృత్వం తో సమాజానికి దిశానిర్దేశం చేసారు అని గుర్తు చేసారు.

ప్రభాత్ ప్రకాశన్ మరియు చేతన స్రవంతి నిర్వహించిన ఈ సభలో ముఖ్య అతిధిగా రామకృష్ణ మఠం లోని వివేకానంద ఇన్సిస్ట్యుట్ అఫ్ ఎక్సెలెన్సుకు మార్గదర్శిగా ఉన్న స్వామి బోధమయానంద పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ యువత దేశానికి భవిషత్తు అని వారిని సన్మార్గంలో తీర్చిదిద్దడంలో ఆర్ ఎస్ ఎస్ ముఖ్య పాత్ర పోషిస్తునది అని తెలిపారు. వారి ప్రసంగంలో “Make ఇండియా Smile Again” (మేక్ ఇండియా స్మైల్ అగైన్) అనే పిలుపునిచ్చారు.

ఈ సభలో ప్రభాత్ ప్రకాశన్ యజమాన్యం నుండి శ్రీ ప్రభాత్ కుమార్, ఆర్ ఎస్ ఎస్ ప్రాంత సంఘ చాలక్ శ్రీ పేట వెంకటేశ్వర్ రావు, చేతన స్రవంతి అధ్యక్షులు శ్రీ సురేందర్ రెడ్డి మరియు వందలాది పుర ప్రజలు పాల్గొన్నారు.