Home News తెలంగాణ సిఎం కేసిఆర్ పై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన వి.హెచ్.పి

తెలంగాణ సిఎం కేసిఆర్ పై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన వి.హెచ్.పి

0
SHARE

కరీంనగర్ బహిరంగ సభలో హిందువులపై అనుచిత వాక్యలు చేయడంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శ్రీ రజత్ కుమార్ గారిని కలిసి డిమాండ్ చేయడం జరిగింది.

కరీంనగర్ బహిరంగ సభలో కేసిఆర్ హిందువులను ఉద్దేశిస్తూ’హిందూ గాళ్ళు-బొందు గాళ్ళు- దిక్కుమాలిన దరిద్రుల చేతిలో దేశం ఉంది’ అంటూ అవమానించడం జరిగింది.దేశ సర్వొన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును కించపరిచే విధంగా జాతీయ సమగ్రతకు భంగం కలిగే విధంగా మాట్లాడాడని వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని వి.హెచ్.పి ప్రతినిధి బృందం లిఖితపూర్వక ఫిర్యాదు తో పాటు కేసిఆర్ ప్రసంగం సిడి ని అందించింది..దీనికి స్పందించిన సిఈఓ  శ్రీ రజత్ కుమార్ గారు కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారులను నివేదిక కోరుతూ ఆదేశించడం జరిగింది. నివేదిక రాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వి.హెచ్.పి బృందానికి హామి ఇవ్వడం జరిగింది.

వి.హెచ్.పి ప్రతినిధి బృందంలో రాష్ట్ర అధ్యక్షులు ఎం. రామరాజు తో పాటు అధికార ప్రతినిది రావినూతల శశిధర్, భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్, భజరంగ్ దళ్ విభాగ్ కన్వీనర్ ముఖేష్, సీనియర్ న్యాయవాది కరుణాసాగర్ , వి.హెచ్.పి జిల్లా కార్యదర్శి గిరిధర్‌, సభ్యులు ప్రశాంత్ లు పాల్గొన్నారు.