Home News హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసిన సి.పి.ఎం కార్యకర్తలు అరెస్ట్

హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసిన సి.పి.ఎం కార్యకర్తలు అరెస్ట్

0
SHARE
కేరళలోని ఒక హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసిన 11 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
ఇటీవల జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలక్కాడ్ మున్సిపాలిటీని బిజెపి కైవసం చేసుకుంది. దీన్ని జీర్ణించుకోలేని సిపిఎం పార్టీ కార్యకర్తలు ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు. అందులో భాగంగా పాలక్కాడ్ లోని హిందూ దేవాలయంలోకి  ప్రవేశించి ధ్వంసం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో కొందరిపై ఇప్పటికే మతమరమైన అల్లర్ల కేసులు ఉండటం గమనార్హం.

Source : Organiser