Home News కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌… ఐదుగురు ఉగ్ర‌వాదుల హతం

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌… ఐదుగురు ఉగ్ర‌వాదుల హతం

0
SHARE

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. పుల్వామా, కుల్గాంలో నిన్న ఉదయం నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మొత్తం ఐదుగురు ఉగ్ర‌వాదులు మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి పుల్వామా జిల్లాలోని పుచాల్‌ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతున్నదని కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు.

కుల్గాంలో మరోసారి ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాంలోని జోడార్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం కుల్గాం పోలీసులు, 1 ఆర్‌ఆర్‌ బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో నిన్న ఒక ఉగ్ర‌వాది మృతిచెంద‌గా, ఈ రోజు తెల్లవారుజాము నుంచి మరో ఇద్దరు తీవ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు మట్టుబెట్టారు. కాగా, కశ్మీర్‌లో గత 24 గంటల్లో ఐదుగురు ఉగ్ర‌వాదులు చ‌నిపోయార‌ని కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు.