Home News కుటుంబంలో ఐక్య‌త, దేశ‌భ‌క్తి జాగృత‌మ‌వ్వాలి – డా. మోహ‌న్ భ‌గ‌వ‌త్ జీ

కుటుంబంలో ఐక్య‌త, దేశ‌భ‌క్తి జాగృత‌మ‌వ్వాలి – డా. మోహ‌న్ భ‌గ‌వ‌త్ జీ

0
SHARE

కుటుంబంలోని ఐక్యత, దేశభక్తి జాగృతం కావడం వలన దేశం శక్తివంతం అవుతుంది అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స‌ర్ సంఘ‌చాల‌క్ డా. మోహన్ భగవత్ జీ అన్నారు. వాస్తవానికి కుటుంబమే దేశ ఆర్ధిక ,సామాజిక, సాంస్కృతిక ఐక్యత ను సూచిస్తుంద‌ని, కుటుంబ ప్రబోధ అనే మాధ్యమం ద్వారా మన సంఘము సమాజంలోని సమతుల్యత, పరస్పర సహకారం, సహృద్భావం పెంపొందించే కృషి చేస్తోందన్నారు.

మహాత్మా జ్యోతిబా పూలె రూహీల్ఖండ్ విశ్వవిద్యాలయంలో అట‌ల్ సభా ప్రాంగణం లో కార్యకర్తల సమావేశంలో మోహ‌న్ జీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లడుతూ ప్రతి వ్యక్తికీ సంస్కారం అనే సుగుణం మొట్టమొదటిగా తన కుటుంబం నుండే లభిస్తుందని తెలిపారు. ఉత్తమ సంస్కృతీ ,చరిత్ర కలిగి దేశం పట్ల అంకిత భావము కలిగిన సమాజాన్ని తయారు చేయడం లో కుటుంబానిదే ముఖ్య భూమిక అన్నారు. అందుకే సంఘ స్వయం సేవకుల కుటుంబాలను భారతీయ మూల సంస్కృతి భావాలతో జోడించి సమాజాన్ని స్వశక్తి తో నింపాల‌న్నారు. ప్రజలు వారి పరంపరాగత సంస్కృతి ని కలిగి ఉండడానికి వారి మూలా వేష భాషలు, స్మరణ భావన, ఆహార విహారాదులను సొంతం చేసుకోవాలన్నారు.

గత వంద ఏళ్లల్లో సంఘం ఎంతో విస్తృతి చెందిందని తెలిపారు. సంఘ ఆలోచనా ధోరణి పట్ల ఆకర్షితులై ప్రభావితులైన దేశ ప్రజలు సంఘంపై ఆశావహులై చూస్తున్నారన్నారు. సమాజంలో సంఘ ముఖ చిత్రం సంఘ‌ సేవకుల నడవడిక ఆచరణలతోనే ఏర్పడుతుందన్నారు. సంఘ సేవకుల ఆచరణలు ఎంత ఉన్నతంగా ఉంటాయో సమాజంలో సంఘ పట్ల ఏర్పడే భావన చిత్రం కూడా అంత‌ ఉన్నతంగా ఉంటుందన్నారు. స్వ‌యం సేవకులు వారంలో ఒక్క రోజైనా తమ పరివారాలతో బంధుమిత్రులతో విందు వినోదాలలో మాత్రమే గడపకుండా దేశం గురించి, మన వారసత్వాల గురించి కూడా తప్పక చర్చించాల‌ని సూచించారు.

స్వయం సేవక పరివారాలు వివిధ జాతి, భాష ప్రాంతాల వారితో మైత్రి సంబంధాలు కలిగి వారితో తరుచు కలిసి మెలిసి భోజనాది చర్చలు జరపాల‌న్నారు. వివిధ ఆర్ధిక స్థాయిలలో కుటుంబాల మధ్య కూడా సుహృద్భావ, పరస్పర సహకార భావాలు ఏర్పడడానికి కూడా స్వయం సేవకులు కృషి చేయాల‌న్నారు. సమర్ధ, సంపన్న, బీద పరివారాల మధ్య సయోధ్య కుదిరితే అనేక ఆర్ధిక, సామాజిక సమస్యలు వాటంతటవే సమసిపోతాయ‌ని మోహ‌న్ జీ అన్నారు. దేశభక్తి ,సద్భావన, విమోచన మరియు క్రమశిక్షణ మన స్వయం సేవకులు జీవన మంత్రమై ఉండాలి. దేశభక్తి అంటే కేవలం దేశాన్ని పూజించడమే కాదు మనం కూడా మన భారత దేశాన్ని అర్ధం చేసుకుని అలాంటి నడవడిక కలిగి ఉండాలి. ఇదే అస‌లైన దేశ భక్తి అని తెలిపారు.

మనం అందరి పట్లా సద్భావన కలిగి ఉండాల‌ని, మన మిత్రుల కష్టాలను తొలగించే ప్రయత్నం చేసి మన సాంగత్యం తో వారిని మెరుగుపరిచే ప్రయత్నం చేయాలన్నారు. మన జీవితం వివిధ వ్యక్తులకు ఋణపడి ఉంద‌ని, మనకు వస్త్రాలు, భోజనాదులను సమాజంలో మనకు అందించే విభిన్న వర్గాల వారికి మనం ఋణపడి ఉండాల‌న్నారు. ఎవరైతే లోక కళ్యాణం కొరకు వారి జీవితాలను త్యాగం చేస్తారో వారు యుగ యుగాల వరకు గుర్తుండిపోతారు. అలాగే క్రమశిక్షణ లేని ఏ దేశము ప్రగతి సాధించలేదన్నారు. మన దేశాన్ని మరొకసారి విశ్వ గురువు గా నిల పాలంటే మన జీవితాలలో క్రమశిక్షణకు పెద్ద పీట ఈ సంద‌ర్భంగా మోహ‌న్ జీ అన్నారు.

ఈ సందర్భంగా భయానక దేశ విభజన శ్మృతి ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన లో దేశ విభజన జరిగిన సమయంలో వివిధ ప్రదేశాలలోని చిత్రాలు, వార్తా పత్రిక కధనాలు పలు సేకరణల ద్వారా లభించిన విషాద చిత్రాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమములో క్షేత్ర, ప్రాంతీయ మరియు వివిధ విభాగాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.