Home News “దాడికి గురైన పూజారికి ఎక్స్-గ్రేషియా చెల్లించాలి” – వరంగల్ న్యాయవాదుల నిరసన ప్రదర్శన

“దాడికి గురైన పూజారికి ఎక్స్-గ్రేషియా చెల్లించాలి” – వరంగల్ న్యాయవాదుల నిరసన ప్రదర్శన

0
SHARE
వరంగల్ జిల్లాకోర్టు న్యాయవాదులు పోచమ్మ మైదాన్ దగ్గర ఉన్న శివ సాయి మందిర్ వృద్ధుడైన పూజారి సత్యనారాయణపై ఇతర మతానికి చెందిన వ్యక్తి  చేసిన దాడి, హత్యా ప్రయత్నాన్ని నిరసిస్తూ అమరవీరుల స్థూపం దగ్గర నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఒక ప్రేమికుడిని హత్య చేస్తే నష్టపరిహారం ప్రకటించిన ప్రభుత్వం వృద్ధుడైన పూజారి చావు బ్రతుకుల్లో ఉంటే కనీసం పరామర్శించలేదని విమర్శించారు. పూజారికి 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని, అతని ఆరోగ్యం పూర్తిగా కుదుట పడేవరకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఆలయ పూజారి సంఘీభావం తెలుపుతూ అతనిని పరామర్శించారు.
తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు సిరికొండ సంజీవరావు, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.