Home News వ్యాధులకు ఔషధం గంగాజలం

వ్యాధులకు ఔషధం గంగాజలం

0
SHARE
  • యాంటీబయాటిక్స్‌కు ప్రత్యామ్నాయం
  • AIIMS – న్యూ ఢిల్లీ పరిశోధనల్లో వెల్ల‌డి

గంగా నదిలో వృద్ధి చెందే నిర్దిష్ట రకమైన బ్యాక్టీరియా తీవ్రమైన వ్యాధుల చికిత్సలో ఇప్పటికే ఉన్న కొన్ని మందుల కంటే చాలా ప్రభావవంతంగా ఉంటుందని AIIMS న్యూ ఢిల్లీ అధ్యయనంలో వెల్ల‌డైంది. ఒక పత్రిక తన కథనంలో ఈ విషయాన్ని పేర్కొంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మాన‌వుని రక్తప్రవాహంలో ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన కాలిన గాయాలు, శస్త్రచికిత్సా ప్రదేశాలు, న్యుమోనియా, పుండ్లు, డయాబెటిక్ ఇన్ఫెక్షన్లతో సహా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల చికిత్సలో తమ సామర్థ్యాన్ని కోల్పోయిన యాంటీబయాటిక్స్‌కు గంగా న‌దిలోని ఉండే బ్యాక్టీరియా గొప్ప ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు.

నాలుగేళ్ల క్రితం వారణాసిలోని పలు గంగా ఘాట్‌ల నుంచి సేకరించిన నీటి నమూనాలపై ఎయిమ్స్‌ మైక్రోబయాలజీ విభాగం పరిశోధనలు నిర్వహించింది. పరిశోధకుల ప్రకారం, నీటిలోని సూక్ష్మజీవులలో ఒకటి ప్రత్యేక DNA ను కలిగి ఉందని, ఇది ఔషధాలకు కూడా లొంగని వ్యాధుల చికిత్సకు ఉపయోగించ‌వ‌చ్చ‌ని తెలిపారు. ప‌రిశోధ‌కులు ఈ సూక్ష్మజీవికి ‘సూడోమోనాస్ ఎరుగినోసా’ అని పేరు పెట్టారు. సూడోమోనాస్ ఎరుగినోసా ముఖ్యంగా రోగనిరోధక శక్తి లేని వ్యక్తులకు మంచి చేసే బ్యాక్టీరియాగా పేర్కొంటారు.

ఎయిమ్స్ మైక్రోబయాలజీ విభాగపు అధిపతి డాక్టర్ రామ చౌదరి మాట్టాడుతూ “సెఫ్టాజిడిమ్, ఇమిపెనెమ్, అమికాసిన్‌తో సహా యాంటీబయాటిక్స్ అంటువ్యాధుల చికిత్సలో పనికిరావని అద‌నంగా బ్యాక్టీరియా మాదకద్రవ్యాల నిరోధకతను అభివృద్ధి చేస్తాయ‌ని, కొన్ని యాంటీబయాటిక్ చికిత్సను తికమక పెట్టే సమస్యను సృష్టిస్తాయి. కొన్ని రకాల బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు తరచుగా తీవ్రంగా ఉంటాయని, అధిక అనారోగ్యాలను, మరణాలు, కూడా కలిగిస్తాయి. మధుమేహం కారణంగా ప్రజలు తీవ్రమైన చర్మపు పుండ్లు ఏర్పడే సందర్భాలు ఉన్నాయి. అప్పుడు శరీర భాగాలను తొల‌గించాల్సి ఉంటుంది. ఈ ఎరుగినోసాను WHO కూడా ప్రాధాన్యత కలిగిన వ్యాధికారకంగా గుర్తించింది. కొత్త యాంటీమైక్రోబయల్ చికిత్సల ఆవిష్కరణ, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుంది. ” అని పేర్కొన్నారు.

తీవ్రమైన శారీరక రుగ్మతలతో బాధపడుతున్న రోగులు ఆసుపత్రికి వచ్చిన ఇతర సందర్భాలను ప్రస్తావిస్తూ వారి పరిస్థితులలో ఉపయోగించడానికి యాంటీబయాటిక్‌లు అందుబాటులో ఉండ‌వు లేదా ఉపయోగపడవు. అటువంటి కేసులకు చికిత్స చేయడంలో ఈ బ్యాక్టీరియా చాలా ప్రభావవంతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆమె పేర్కొంది.

శరీరానికి ఉపయోగపడే సూక్ష్మజీవులను చంపే మునుపటి యాంటీబయాటిక్స్‌కు భిన్నంగా, ఈ ప్రత్యేకమైన గంగా నీటి సూక్ష్మజీవి రోగనిరోధక వ్యవస్థ హానికరం కాదని నిరూపితమైంద‌ని అధ్యయన బృందం సభ్యులు డాక్టర్ నిషా రాథోర్ తెలిపారు.

Source : OPINDIA