Home Ayodhya అయోధ్య నిధి స‌మ‌ర్ప‌ణలో న‌కిలీల‌తో జాగ్ర‌త్త‌

అయోధ్య నిధి స‌మ‌ర్ప‌ణలో న‌కిలీల‌తో జాగ్ర‌త్త‌

0
SHARE

అయోధ్య రామజన్మభూమిలో నిర్మిస్తున్న మందిరం కోసం నిధి సమర్పణ అభియాన్ కేవలం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్వర్యంలోనే జరుగుతున్నదని, ఇది కాకుండా మరే ట్రస్ట్ లు, వ్యక్తులు నిధి సేకరణ చేయరాదని విశ్వహిందూ పరిషత్ ఒక ప్రకటనలో హెచ్చరించింది. కొన్ని ప్రైవేట్ ట్రస్ట్ లు, కొందరు వ్యక్తులు సొంతగా రశీదు పుస్తకాలు ముద్రించి నిధి సేకరణ చేస్తున్నట్లు తమకు తెలిసిందని, అలాంటివారు ఆ పని వెంటనే ఆపివేయాలని స్పష్టం చేసింది. ఎర్రబెల్లి ట్రస్ట్ పేరిట జనగాంలో ఇలా రామమందిర నిధి సేకరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వారు వెంటనే ఆ కార్యక్రమాన్ని ఆపివేయాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత కార్యదర్శి, రామజన్మభూమిమందిర నిధి సమర్పణ అభియాన్ ప్రాంత సంయోజక్ శ్రీ బండారి రమేశ్ ఒక వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. రామభక్తులైన ప్రజానీకం తమ ఇళ్ళ వద్దకు వచ్చే విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలకు మాత్రమే నిధి సమర్పించి తగిన రశీదు తీసుకోవాలని, లేదంటే ఆన్ లైన్ ద్వారా తీర్థ క్షేత్ర ట్రస్ట్ బ్యాంక్ అకౌంట్ కు నేరుగా నిధిని పంపాలని ఆయన కోరారు. ప్రైవేటు ట్రస్ట్ లు, వ్యక్తులకు నిధి ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు.