Home News భైంసాలో మరోసారి ఉద్రిక్తత

భైంసాలో మరోసారి ఉద్రిక్తత

0
SHARE
నిర్మల్ జిల్లా: లాక్-డౌన్ ఉల్లంఘన విషయంలో తలెత్తిన వివాదం భైంసాలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది.
అందిన వివరాల ప్రకారం.. భైంసా పట్టణంలోని శివాజీనగర ప్రాంతంలో ఇటీవల కొత్తగా మసీదు నిర్మాణం జరిగింది. 10వ తేదీ రాత్రి సుమారు 200 మంది లాక్-డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రార్ధనల పేరిట ఆ మసీదు వద్ద గుమిగూడటంతో స్థానికులు వారిని వారించే ప్రయత్నం చేశారు.
దీంతో వివాదం తీవ్రమై ఇరువర్గాల వారు పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు ఒక ఇంట్లోకి చొరబడి సామాను ధ్వంసం చేశారు. ఆ ఇంటి ఎదుట నిలిపిన ఓ ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టారు.
ఘటనకు సంబంధించి 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్ అయినవారంతా ఒకే మతానికి చెందిన వారుగా సమాచారం.