Home News ధ‌ర్మ‌జాగ‌ర‌ణ జ్యేష్ఠ కార్య‌క‌ర్త శ్రీమన్నారాయణ దాసు జీ అస్త‌మ‌యం

ధ‌ర్మ‌జాగ‌ర‌ణ జ్యేష్ఠ కార్య‌క‌ర్త శ్రీమన్నారాయణ దాసు జీ అస్త‌మ‌యం

0
SHARE

ధ‌ర్మ‌జాగ‌ర‌ణ జ్యేష్ఠ కార్య‌క‌ర్త శ్రీమన్నారాయణ దాసు (భిక్ష్మయ్య) గారు సోమ‌వారం (06.5.2022) రాత్రి గుండెపోటుతో మ‌ర‌ణించారు. దాసు గారు నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం గార్లభాయి గూడెం గ్రామ నివాసి. తెలంగాణ ప్రాంతంలో ధర్మ జాగరణ పని ప్రారంభం నుండి పూర్తి సమయ కార్యకర్తగా పని చేసిన అనుభవం కలిగిన కార్యకర్త. దాసు గారు ధర్మ జాగరణ పని శ్రద్ధ, నిష్ఠతో నిజాయితీగా పని చేశారు. తెలిసో తెలియకో మతం మారిన వేలాది హిందువుల‌ను పునరాగమనం చేయించారు. ఈ పని చేస్తున్న స‌మ‌యంలో విధర్మీయుల నుండి ఎదురైన అనేక సవాళ్ళను ధైర్యంగా ఎదురోడ్డి నిలిచారు. లక్ష్య సాధకులు శ్రీ దాసు గారు ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొని ధర్మ జాగరణ కార్యం చేసిన పరిశ్రమశీలి ఎండలో కాలి నడకన గ్రామాలకు వెళ్లి ప‌ని చేశారు. సంఘ శిక్షా వర్గ ద్వితీయ వర్ష శిక్షణ పూర్తి చేసారు. వారి మృతి ప‌ట్ల పలువురు హిందూ సంఘాల నాయ‌కులు సంతాపం తెలిపారు. వారిని కోల్పోవడం సమాజ కార్యానికి ధర్మ జాగరణకు తీరని లోటు అని, భగవంతుడు వారి దివ్యాత్మకు సద్గతి కలిగించాలని ప్రార్థిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.