Home News రాజనాలకు రామ్మోహనరావు స్మారక పురస్కార ప్రదానం

రాజనాలకు రామ్మోహనరావు స్మారక పురస్కార ప్రదానం

0
SHARE

భాగ్యనగరం : సమాచార భారతి (తెలంగాణ) అధ్వర్యంలో (మే 8) ప్రపంచ పాత్రికేయ దినోత్సవం, దేవర్షి నారద జయంతి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రాజనాల బాలకృష్ణ వడ్లమూడి రామ్మోహనరావు స్మారక పురస్కారానికి ఎంపికయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల నాటి కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు. సమాచార భారతి కమిటీ సభ్యులు వేదుల నరసింహం, కోశాధికారి పి. రాఘవేంద్రశర్మ మే 28న బాలకృష్ణ నివాసానికి వెళ్లి ఆయనను సత్కరించి, పురస్కారం అందజేశారు. రాజనాల గత నలభై సంవత్సరాలుగా పత్రికా రంగంలో సేవలందిస్తున్నారు.