Home News విజ‌య‌వ‌తంగా ముగిసిన G20 స‌ద‌స్సు 

విజ‌య‌వ‌తంగా ముగిసిన G20 స‌ద‌స్సు 

0
SHARE
  • భారత్​ చొరవతో జీ20లోకి శాశ్వత సభ్య దేశంగా చేరిన ఆఫ్రికా యూనియన్​
  • అనేక ముఖ్యమైన నిర్ణయాలకు ప్రపంచ నాయకులు ఆమోదం
  • ఢిల్లీ డిక్ల‌రేష‌న్‌ను ఆమోదించిన G20 స‌భ్య దేశాలు


భారత్‌ తొలిసారిగా అతిథ్యమిస్తున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీ వేదికగా శనివారం అట్టహాసంగా ప్రారంభ‌మై, ఆదివారం విజ‌య‌వంతంగా ముగిసింది. ప్రపంచ దేశాల నేత‌ల‌కు భార‌త‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప‌లికారు. ఢిల్లీ ప్రగతి మైదాన్​లోని భారత మండపం వేదికగా రెండు రోజుల సదస్సులో ప్రపంచ నేతలు పాల్గొన్నారు.

స‌ద‌స్సు ప్రారంభంలో ప్రధాని న‌రేంద్ర మోడీ ఆఫ్రికన్​ యూనియన్​కు జీ 20లోకి స్వాగతం పలికారు. ఇది ఆఫ్రికెన్​ యూనియన్​కు ఓ చారిత్రిక ఘట్టం! సభ్యులందరి అంగీకారంతో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆఫ్రికన్‌ యూనియన్‌ అధినేత అజాలీ అసౌమనీని శాశ్వత సభ్యులకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు. 55 సభ్య దేశాలున్న ఆఫ్రికా యూనియన్‌ AU జీ 20లో శాశ్వత సభ్య దేశంగా చేరింది. సుమారు 130 కోట్ల జనాభా కలిగిన AU చేరడంతో జీ20 కూటమి ప్రపంచానికి మరింత దగ్గరైంది.

G20 స‌మావేశాల్లో న్యూఢిల్లీ డిక్లరేషన్ ను G20 సభ్యదేశాలు ఏక‌గ్రీవంగా ఆమోదించాయి. ఇది భారత దౌత్యవేత్తలు చేసిన కృషికి నిద‌ర్శ‌నం. గ‌తంలో జ‌రిగిన G20 స‌మావేశాల‌ను గ‌మ‌నిస్తే చాలా వరకు సమావేశాలు ఉమ్మడిగా జ‌ర‌గ‌లేవు. అయితే పాశ్చాత్య దేశాలకు ఉక్రెయిన్ ఒక స‌మ‌స్య‌గా మారింది. రష్యాకు వ్యతిరేకంగా మాస్కో, బీజింగ్ అంగీకరించపోవ‌డంతో, ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న ఉంటుందా అనే ప్రతిష్టంభన ఏర్పడింది. కానీ ప్ర‌స్తుతం విదేశాంగ మంత్రులు, ఆర్థిక మంత్రులు, వాణిజ్యం మంత్రులు చోర‌వ‌తో ఉమ్మ‌డి స‌మావేశాలు జ‌రిగాయి.

34 పేజీల ఢిల్లీ డిక్లరేషన్ లో అనేక అంశాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం, అభివృద్ధి లక్ష్యాలు, క్లైమేట్ ఫైనాన్సింగ్, క్రిప్టోకరెన్సీ, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం గురించి డిక్ల‌రేష‌న్‌లో పొందుప‌రిచారు.

ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించి బాలిలో జరిగిన చర్చను గుర్తుచేసుకుంటూ, ప్ర‌స్తుత ఢిల్లీ డిక్ల‌రేష‌న్‌ను పునరుద్ఘాటించారు. రష్యా దురాక్రమణ గురించి ప్రస్తావించిన బాలి ప్రకటనకు ఢిల్లీ డిక్ల‌రేష‌న్ కొంచెం భిన్నమైనది. ఇది యునైటెడ్ గురించి కూడా ప్రస్తావించింది. ఉక్రెయిన్ నుంచి రష్యా వైదొలగాలని నేషన్స్ తీర్మానం చేసింది. ఢిల్లీ ప్రకటన అలా లేదు. అన్ని దేశాలు పూర్తిగా U.N చార్టర్  ప్రయోజనాలు, సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలి. ఏదైనా దేశ ప్రాదేశిక, సమగ్రత, సార్వభౌమాధికారం లేదా రాజకీయ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా ప్రాదేశిక స్వాధీనం కోసం అన్ని దేశాలు ముప్పు లేదా బలాన్ని ఉపయోగించకుండా ఉండాలి.

భార‌త విదేశాంగ మంత్రి దీనిపై మాట్లాడుతూ బాలి డిక్ల‌రేష‌న్‌, ఢిల్లీ డిక్ల‌రేష‌న్ కు చాలా వ్య‌త్యాసం ఉంద‌ని, అప్ప‌టి పరిస్థితి భిన్నంగా ఉందని, అప్పటి నుండి చాలా విషయాలు జరిగాయ‌ని అన్నారు.. వాస్తవానికి డిక్లరేషన్ భౌగోళిక రాజకీయ  విభాగంలో చూస్తే మొత్తం ఎనిమిది పేరాగ్రాఫ్‌లు ఉన్నాయి, వీటిలో ఏడు ఉక్రెయిన్ సమస్యపై దృష్టి సారించాయి.

డిక్ల‌రేష‌న్ ద్వారా భార‌త్ ఐదు ప్రధాన అంశాలకు ప్రాధాన్య‌తనిచ్చింది. దృడ‌మైన, స్థిరమైన వృద్ధి,  సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై పురోగతిని వేగవంతం చేయ‌డం, ప్ర‌పంచ పున‌రుద్ద‌ర‌ణ‌కు 21వ శతాబ్దంలో బహుపాక్షిక సంస్థల సృష్టి వంటి అనేక అంశాల‌తో పాటు సామాజిక-ఆర్థిక సమస్యల‌పై కూడా డిక్ల‌రేష‌న్‌లో పేర్కొన్నారు. మ‌రోవైపు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం లాంటివి, రాజకీయ అంశాల‌పై కూడా దృష్టి సారించింది.  పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో చేర్చిన ఫైనాన్సియ‌ల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్  వంటి సంస్థ‌ల‌కు ఢిల్లీ డిక్లరేష‌న్ పూర్తి మ‌ద్ధ‌తు ఇవ్వ‌నుంది. మరొక సమస్య క్రిప్టోకరెన్సీని పర్యవేక్షించడం, నియంత్రించడం వంటి స‌మ‌స్య‌ల‌పై ఢిల్లీ డిక్ల‌రేష‌న్ క‌ట్టుబ‌డి ఉంది.

వాతావరణ మార్పుపై  కూడా ఢిల్లీ డిక్ల‌రేష‌న్ లో పేర్కొన్నారు. కనీసం అభివృద్ధి చెందిన దేశాలు, దీవులు పారిస్ ఒప్పందాన్ని అనుసరించాల‌ని పేర్కొంది. గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీ సెల్సియస్ పరిమితం చేయాల‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుత ప‌రిస్థుతులో ఇది క‌ష్ట‌మైన‌దే. కాబట్టి ఉద్గార లక్ష్యాలు సాధించాలిని ఢిల్లీ డిక్ల‌రేష‌న్ G20 దేశాల నాయకుల‌ను కోరింది. పునరుత్పాదక శక్తిని మూడు రెట్లు పెంచడం గురించి G20 మొదటిసారి ప్ర‌స్తావించింది. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి సామర్థ్యం, శిలాజ సబ్సిడీలపై దృష్టి పెట్టండం, క్లైమెట్ ఫైనాన్స్‌లో బిలియన్ల నుండి ట్రిలియన్ల డాలర్లు వరకు భారీ దృష్టి వంటి వాటిపై G20  మొద‌టి సారిగా మాట్లాడింది.

G20 స‌మావేశంలో కేవలం ఢిల్లీ డిక్లరేషన్ పై ఉమ్మడి ప్రకటన మాత్ర‌మే కాదు,  G20లో భాగంగా అంత‌కు ముందు చాలా ప‌ని జ‌రిగింది.  220 కంటే ఎక్కువ G20 స‌మావేశాల‌కు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. వాటిలో 17 మంత్రుల స్థాయి స‌మావేశాలున్నాయి. గ‌డిచిన కొన్ని నెల‌లుగా భారతదేశ వ్యాప్తంగా 60 నగరాలు G20 స‌మావేశాల‌కు అతిథ్యమిచ్చాయి. ఇందులో 43 దేశాల‌కు చెందిన అధ్య‌క్షులు, ప్ర‌ధానులు,  UN, ప్రపంచ బ్యాంకు వంటి గ్లోబల్ ఏజెన్సీల అధిపతులు ఉన్నారు. 115 కంటే ఎక్కువ దేశాల నుండి 25,000 ప్రతినిధులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.  దాదాపు 112 ఫలితాల పత్రాలను విడుదల చేసింది. గత G20 అధ్య‌క్ష‌త వ‌హించిన దేశాల‌ కంటే దాదాపు రెండు నుండి ఐదు రెట్లు ఎక్కువ.

UK ప్రధాని రిషి సునాక్, జ‌పాన్ ప్రధాన మంత్రి ఫ్యూమియో కిషిడా, ఇటలీ ప్రధాని జార్జియో మలోనీతో భార‌త‌ ప్రధాని న‌రేంద్ర మోదీ వేర్వేరుగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బహుపాక్షిక గ్లోబల్ జీవ ఇంధన కూటమి U.S. బంగ్లాదేశ్, UAE కూడా దానిలో భాగంగా ఉంది. పెట్రోలులో 20 శాతం ఇథనాల్ కలపడం గురించి ఇందులో చ‌ర్చించారు. పెట్రోలుతో ఇథనాల్ శిలాజ వినియోగాన్ని తగ్గించవచ్చు.

క్రాస్ కాంటినెంటల్ ఎకనామిక్ అనే పేరుతో మ‌రో స‌మావేశం జ‌రిగింది. భారత్, US, EU, సౌదీ అరేబియా, UAEలతో పాటు, భారతదేశం-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ (IMEE EC) ఏర్పాటుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది, ఇది పశ్చిమ ఆసియా, ఐరోపాకు వేగంగా, చౌకగా సముద్ర, రైలు రవాణా ఎంపికను అందిస్తుంది. చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ (OBOR) చొరవకు కౌంటర్‌గా పరిగణించబడుతుంది. అక్కడ భాగస్వాముల ఐదు పశ్చిమాసియా నుండి సౌదీ అరేబియా, UA ఇజ్రాయెల్, జోర్డాన్, పశ్చిమ దేశాల నుండి యూరోపియన్ యూనియన్ ఉంది.  తూర్పు నుండి  భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ కూడా ఇందులో భాగంగా ఉంటుంది. జి 20 సదస్సు సందర్భంగా అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన “చారిత్రక భాగస్వామ్యాన్ని” ప్రకటిస్తూ, రాబోయే కాలంలో ఇది భారతదేశం, పశ్చిమాసియా మరియు ఐరోపా ఆర్థిక ఏకీకరణకు సమర్థవంతమైన మాధ్యమంగా మారుతుందని ప్రధాని మోదీ అన్నారు.

భారతదేశాన్ని పశ్చిమాసియా, యూరప్‌లతో అనుసంధానించే వాణిజ్య కారిడార్‌ను ఏర్పాటు చేయడంలో సహాయం చేసినందుకు ప్రధాని మోదీని ప్రశంసిస్తూ, ప్రతిపాదిత భాగస్వామ్యం ప్రస్తుత G20 యొక్క వన్ ఎర్త్, వన్ ఫ్యూచర్ థీమ్‌తో సమకాలీకరించబడిందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు.

భారత ఉపఖండం, ఐరోపా మధ్య పురాతన వాణిజ్య కారిడార్‌ను సూచిస్తూ, ప్రతిపాదిత ఒప్పందాన్ని న్యూ  స్పైస్ రూట్ గా విశ్లేషించారు. ఈ ప్రాజెక్ట్ రెండు కారిడార్లను కలిగి ఉంటుంది – తూర్పు-పశ్చిమ, భారతదేశాన్ని పశ్చిమాసియాకు, ఉత్తర కారిడార్ పశ్చిమాసియా నుండి యూరప్ వరకు కలుపుతుంది. IMEE ECని ఆగ్నేయాసియాకు అనుసంధానం చేయడం, కొన్ని బిల్డింగ్ బ్లాక్‌లను వాణిజ్యంపై ప్రభావితం చేయడం ఆలోచన.

భారత్‌లో జరిగిన జీ20 సదస్సు విజయవంతంగా ముగియగా, జీ20 అధ్యక్ష పీఠాన్ని బ్రెజిల్ అధ్యక్షుడికి అప్పగించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో, ప్రపంచ నాయకులు అనేక ముఖ్యమైన నిర్ణయాలను ఆమోదించారు. వన్ ఫ్యూచర్ పేరుతో జరిగిన జీ20 చివరి సెషన్‌లో ప్రధాని మోదీ అధికారికంగా బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వాకు భారత జీ20 అధ్యక్ష పదవిని అందజేశారు. వచ్చే ఏడాది బ్రెజిల్‌లో జీ20 సదస్సు జరగనుంది. బ్రెజిల్ తర్వాత, 2025లో దక్షిణాఫ్రికా G20 అధ్యక్ష పదవిని నిర్వహిస్తుంది. అనంతరం 2026లో జీ20 అధ్యక్ష పీఠాన్ని అమెరికా కైవసం చేసుకుంటుందని వెల్లడించారు.