Home News క‌న్వ‌రియా యాత్రికుల‌పై ఇస్లాం మ‌తోన్మాదుల దారుణాలు… కొన‌సాగుతున్న అడ్డంకులు

క‌న్వ‌రియా యాత్రికుల‌పై ఇస్లాం మ‌తోన్మాదుల దారుణాలు… కొన‌సాగుతున్న అడ్డంకులు

0
SHARE

క‌న్వారియా యాత్ర‌పై ఇస్లాం మ‌తోన్మాదుల అడ్డంకులు కొన‌సాగుతున్నాయి. కన్వారియాలపై రాళ్లు రువ్వినందుకు వారిపై కలుషిత నీటిని విసిరినందుకు బరేలీలోని పరాగ్వాకు చెందిన గ్రామ స‌ర్పంచ్ షకినాతో సహా 6 మందిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన త‌ర్వాత కొద్ది రోజుల‌కే ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని షేర్ఘర్ బ్లాక్‌లోని దుంకా గ్రామంలో నివసిస్తున్న స్థానిక ముస్లింలు కన్వారియాలను గ్రామంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్న ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

దుంకా ముస్లింలు అధికంగా ఉండే గ్రామం. ఇది మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలోని కలాపిపాల్ తహసీల్‌లో ఉన్న చక్రోడ్ గ్రామం మీదుగా హరిద్వార్ చేరుకోవడానికి ఇది అతి ద‌గ్గ‌రి మార్గం. ప్రతీ సంవత్సరం వేలాది మంది కన్వారియాలు పవిత్రమైన శ్రావణ మాసంలో హరిద్వార్ చేరుకుని, గంగా నది పవిత్ర జలాన్ని తీసుకుని తిరిగి త‌మ స్వ‌గ్రామాల‌కు వచ్చి దేవాలయాలలో శివుడికి సమర్పించడానికి ఈ ప్రత్యేక మార్గాన్ని వారు గ‌త కొన్నేళ్లుగా అనుసరిస్తూ వ‌స్తున్నారు.

అయితే ఈ సంవత్సరం డంకా ముస్లింలు కన్వర్ యాత్ర ఊరేగింపును ఈ మార్గం గుండా వెళ్ల‌కుండా గొడవలు సృష్టిస్తూ వారిని అడ్డుకున్నారు. ఈ మార్గం కాకుండా హ‌రిద్వార్‌కు మరో మార్గంలో వెళ్లాలని వారు ప‌ట్టుబ‌ట్టారు. అయితే ఆ మార్గం ఎక్కువ దూరం ప్ర‌యాణించాల్సి ఉంటుంది. ఈ గురువారం, కన్వారియాలు ఒక ట్రాక్టర్-ట్రాలీపై DJతో డంకాలోని ముస్లింలు నివ‌సించే ప్ర‌దేశానికి ఇదే ప్రాంతం గుండా వెళ్లాలని పట్టుబట్టారు.

సమాచారం అందుకున్న స‌బ్ డివిజ‌న్ మేజిస్ట్రేట్, సర్కిల్ అధికారి RK మిశ్రా ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. అధికారులు కన్వారియాలకు ఈ మార్గం గుండా వెళ్లాలని వివరించారు. పోలీసుల ప్రకారం, 2014 కన్వర్ యాత్ర మార్గంలోరెండు వర్గాల సభ్యుల మధ్య ఘర్షణ చెలరేగడంతో, అప్ప‌టి అధికార యంత్రాంగం కన్వారియాలకు దుంకీ రహదారిపై ప్రయాణించకుండా ఒక నిర్దిష్ట మార్గాన్ని కేటాయించింది. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి, నిర్దేశించిన మార్గంలో నడవాలని కన్వరియాలను పోలీసులు కోరారు. యాత్రికులు స్పందిస్తూ దంకా వాసుల మధ్య ఒప్పందం కుదిరిందని, ఇందులో దుంకీ వాసుల‌కు సంబంధం లేద‌ని వారు తెలిపారు.

అవ‌స‌ర‌మైతే దుంకా రహదారిపై వేచి ఉంటామని, ఎక్కువ దూరం ప్రయాణించేలా చేస్తే ఊరేగింపును కొనసాగించబోమని కన్వారియాలు పోలీసులను హెచ్చరించారు. ప‌రిస్థితిని మరింత తీవ్రతరం కాకుండా పోలీసులు మార్గం పొడవునా బారికేడ్లను, పోలీసు బందోబస్తును మోహరించారు.

ఈ విషయం గురించి ఎస్‌డిఎం వేద్ ప్రకాష్ మిశ్రా మాట్లాడుతూ, దంకా గ్రామం గుండా వెళ్లేందుకు కన్వారియాలు పట్టుదలగా ఉంటే, పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. ఒకవేళ వారు నిర్దేశించిన మార్గంలో వెళితే పోలీసులు వారికి పూర్తి భద్రత కల్పిస్తారని మిశ్రా తెలిపారు.

అయితే కన్వారియాలు యాత్ర చేసే సమ‌యంలో ఏమీ తినకుండా, క‌నీసం చెప్పులు కూడా లేకుండా పాద‌యాత్ర చేస్తుంటారు. కాబ‌ట్టి తక్కువ మార్గం అందుబాటులో ఉన్నప్పుడు, ఎక్కువ దూరం ప్ర‌యాణించాల‌ని వారిని బలవంతం చేయడం హింసాత్మకం అవుతుంద‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

అయితే కన్వారియాలపై దాడులు, వేధింపులు కొత్తేమీ కాదు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా యాత్రపై విద్వేషపూరిత దాడులు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

కన్వారియాలపై ద్వేషపూరిత దాడులు
జులై 30న, బరేలీలోని పరాగ్వా గ్రామ స‌ర్పంచ్‌ షకీనా, ఆమె మామ ఇష్తియాక్ నేతృత్వంలోని గ్రామస్థులు వారి గ్రామం గుండా వెళుతున్న కన్వారియాలపై కలుషితమైన నీటిని విసిరారు, రాళ్లు రువ్వారు.

జూలై 25న ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలోని ఇబ్రహీంపూర్‌లోకి ప్రవేశించకుండా కన్వారియాలను ముస్లిం మహిళల బృందం అడ్డుకుంది. రహదారిపై మంచాలు వేసి, యాత్రికులు తిరిగి వెళ్లి నిర్దేశించిన మార్గంలో వెళ్లాలని ఒత్తిడి తెచ్చారు.

జులై 22న మీరట్‌లో కన్వారియాలపై ఇస్లాంవాదులు ఉమ్మేసిన మరో సంఘటన జరిగింది. విశ్రాంతి కోసం కాసేపు రోడ్డు పక్కన కూర్చున్న యాత్రికుల‌పై ఇద్దరు ముస్లిం వ్యక్తులు బైక్‌పై వచ్చి వారిపై ఉమ్మివేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత వారిలో ఒకరు బైక్ దిగి కన్వరియాలపై ఉమ్మి వేశారు. ఈ ఘటనతో కన్వారియాలు రోడ్డుపై బైఠాయించి, పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జూలై 19న ఢిల్లీలోని సీలంపూర్‌లో కన్వర్ యాత్రపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు మాంసం ముక్కను విసిరారు. ఢిల్లీకి చేరుకోవడానికి ఏడు రోజులకు పైగా నడిచిన ఈ కన్వారియాల‌కు ఇతర ప్రదేశాలలో పూలతో స్వాగతం పలకగా, ఢిల్లీలోని కొద్దిమంది ప్రజలు తమపై మాంసం విసిరేసే ప‌రిస్థితి ఎదుర్కోవలసి వచ్చింద‌ని యాత్రికులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

Source : OPINDIA