Home News ‘మ‌న చ‌రిత్ర‌పై మ‌రింత అధ్య‌య‌నం అవ‌స‌రం’

‘మ‌న చ‌రిత్ర‌పై మ‌రింత అధ్య‌య‌నం అవ‌స‌రం’

0
SHARE

మ‌న దేశ చ‌రిత్ర‌పై మ‌రింత అధ్య‌య‌నం అవ‌స‌ర‌మ‌ని ఉస్మానియా యునివ‌ర్సిటీ చరిత్ర శాఖాధిపతి, చరిత్రకారుడు శ్రీ అంజయ్య గారు అన్నారు. దక్షిణా పధ స్టడీస్ ఆధ్వర్యంలో అజ్ఞాత చారిత్రక వీరులపై ఉపన్యాసాలలో భాగంగా రెండవ ఉపన్యాసంగా “రెడ్డి రాజులు” అనే అంశంపై ఉస్మానియా యునివ‌ర్సిటీ లోని సురభారతి సమావేశ మందిరంలో జరిగిన స‌మావేశానికి ఆయ‌న ప్ర‌ధాన వ‌క్త‌గా హాజ‌రై ప్ర‌సంగించారు. రెడ్డి రాజులు దాదాపు వంద సంవత్సరాలకు పైగా పరిపాలించారనీ వారి యుద్దాలు విజయాలు వంటి చర్వితచరణ చరిత్ర కాకుండా, ఆ కాలపు సాహిత్యాన్ని గమనిస్తే మనకు అనేక కొత్త విషయాలు తెలుస్తాయని, మనం చరిత్రను చూసే దృక్కోణంలో మార్పు వస్తుందని, రావాలనీ ఆయన అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను రెడ్డి రాజులు కాపాడిన తీరు ఎంతో గొప్ప‌ద‌న్నారు. వ్యాపార ఎగుమతుల కోసం రెడ్డి రాజులు ఓడరేవులను ఎలా అభివృద్ధి చేశారో మ‌రింత అధ్యయనం జరిగితే బాగుంటుందని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ అభిప్రాయపడ్డారు. ఈ కర్మభూమిలో పుట్టినందుకు మన చరిత్రను మనమే అధ్యయనం చేసుకొని మాతృభూమి ఋణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన డా. భిన్నూరి మహేశ్వరి గారు మాట్లాడుతూ, తెలంగాణ చరిత్ర, ఆంధ్ర చరిత్ర, భారతీయ చరిత్ర మొత్తంగా గమనిస్తే అనేక మంది అజ్ఞాత వీరులు మనకు కనిపిస్తారని ఈ విషయంపై ఉపన్యాసాలు మంచి ప్రారంభమనీ పేర్కొన్నారు.. అఙాత చరిత్ర కారుల పై అధ్యయనం జరగాలి అని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణా పధ స్టడీస్ అధ్యక్షులు డా. గోపాల్ రెడ్డి గారు, పరిశోధన విభాగం కో-ఆర్డినేటర్ కళ్యాణచక్రవర్తి, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధక విధ్యార్ధిని విధ్యార్ధులు, చరిత్ర అధ్యయన కారులు అనేకమంది పాల్గొన్నారు. డా. లక్ష్మీ నారాయణగారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.