Home News మూర్తీభవించిన ఆదర్శం సురుజీ జీవితం

మూర్తీభవించిన ఆదర్శం సురుజీ జీవితం

0
SHARE

శరీరంలోని ప్రతి అణువణువును సంఘ కార్యంలో విజయవంతంగా  శాశ్వతంగా, ప్రసన్నంగా మరియు పరాక్రమయుతంగా కష్టాన్ని సైతం సునాయాసంగా మలుస్తూ స్వయంసేవకులందరికీ ఒక ఆదర్శంగా జీవించిన ధన్యజీవి కీర్తి శేషులు శ్రీ సూర్యనారాయణ రావు (సురుజి) గారు అని ఆర్.ఎస్.ఎస్  సహ సర్ కర్యవాహ మాననీయ శ్రీ భాగయ్య గారు తెలిపారు.

శ్రీ భాగయ్య గారు 29-నవంబర్ నాడు  హైదరాబాద్ నారాయణగూడ కేశవ మెమోరియల్ కళాశాలలో జరిగిన సూర్యనారాయణ రావు గారి శ్రద్ధాంజలి సభలో మాట్లాడుతూ సురుజి గారి వ్యక్తిత్వం, సాటి మనుషుల పట్ల వారు చూపిన వాత్సల్యం, ప్రేమ, మమతానురాగాలు ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో సంఘ వ్యాప్తికై వారు చేసిన విశేష కృషికి సంబంధిచిన సంఘటనలను వివరిస్తూ పురుషార్థంతో జీవన ప్రయాణాన్ని కొనసాగించిన తపస్సంపన్నుడు అని కొనియాడారు. శ్రీ సూర్యనారాయణ రావు గారు 93 ఏళ్ళ వయసులో ఈ నెల 18 న బెంగళూరు లో స్వర్గస్తులైనారు.dsc_0185

సమాజాన్ని సంఘటితం చేయడంలో సేవ ఒక విశిష్టమైనది అని, ఒక తల్లి పిల్లలకు ఏ విధంగా సేవ చేస్తుందో అదే ప్రేమ, ఆప్యాయతతో మనం కూడా సమాజ సేవ చేయాలి అని ఆయన సరళంగా వివరించేవారు అని తెలిపారు. అలాంటి ఆలోచన, దూరదృష్టి కలిగిన  వ్యక్తి. సంఘం ఇప్పుడు లక్ష యాబై వేలకు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహిచడంలో వారి పాత్ర ఒక మూల స్థంభంలాంటిది అని, వారి మరణంతో దేశం ఒక సామజిక కార్యకర్తను కోల్పోయింది అని కూడా భాగయ్య గారు అన్నారు.

ప్రస్తుతం మన సమాజంలో ఎస్.సి/ఎస్.టి వర్గాలకు సంబంధించిన మన సోదరులకు రాజ్యాంగ బద్ధమైన సర్వ హక్కులను వారికి అందివ్వడంలో, వారిని అందరితోపాటు సగర్వంగా సంపూర్ణంగా, ఆత్మవిశ్వాసంతో  సమాజంలో జీవించేలా సంపూర్ణ హృదయంతో నిరంతరం ప్రయత్నం చేయడమే ప్రతి స్వయంసేవకుడు సురుజి కి అర్పించే నిజమైన శ్రద్ధాంజలి అని ఈ సందర్బంగా తెలియచేసారు.

ఈ శ్రద్ధాంజలి సభలో పాల్గొన్న దక్షిణ మధ్య  క్షేత్ర ప్రచారక్ శ్రీ శ్యాం జీ మాట్లాడుతూ సురుజీ తన 93ఏళ్ళ జీవితంలో 25 సంవత్సరాలు కర్ణాటకలో, 45 సంవత్సరాలు తమిళనాడు లో సంఘ వ్యాప్తికై జీవితాన్ని ధారపోసిన మహాపురుషుడు అని వివరించారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అనే తలంపుతో 75 సంవత్సరాల వయసు మీద పడిన తరువాత స్వతహాగా బాద్యతల నుండి తప్పుకున్నారు అని అన్నారు. 1948 లో మొదటి సారి సంఘంపై  నిషేధం విధించిన కాలానికి ఆయన ప్రత్యక్ష సాక్షి అని ఆ సంఘటనలు స్వయం సేవకులందరికీ తెలియచేసేవారు అని కూడా గుర్తు చేసారు. సురుజీ స్వామి వివేకానంద జీవితంపై విశేష అధ్యయనం చేసిన వ్యక్తి అని, సంఘానికి చాల మంది ప్రముఖులను, సాధారణ స్వయంసేవకులను జోడించారు అని అన్నారు. dsc_0187

తెలంగాణా ప్రాంత సంఘచాలక్ శ్రీ ప్యాటా వెంకటేశ్వర రావు గారు మాట్లాడుతూ సురుజీ  ఆవేదన సంవేదనతో ఉన్నదాన్ని సేవకు నిర్వచనంగా చెప్పే వారు అని, సురుజీ గారి జీవిత విషయాలను ఈ సందర్బంగా గుర్తు చేసారు.

ఈ శ్రద్ధాంజలి సభలో శ్రీ ఎక్కా చంద్రశేఖర్ జీ, శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు,  వి.హెచ్.పి  క్షేత్ర ప్రచారక్ శ్రీ గోపాల్ జీ గారు, జస్టిస్ శ్రీ పర్వత రావు గారు తదితరులు మాట్లాడుతూ తమకు సురుజి తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  ఈ కార్యక్రమానికి హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్న దాదాపు 600 పైగా స్వయంసేవకులందరూ పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.

dsc_0179

dsc_0154

dsc_0166

dsc_0116