Home News ఆగ్రా సేవాభార‌తి కార్యాల‌యంపై ముస్లింల దాడి

ఆగ్రా సేవాభార‌తి కార్యాల‌యంపై ముస్లింల దాడి

0
SHARE

ఆగ్రాలోని సేవా భారతి కార్యాలయంపై స్థానిక ముస్లింలు దాడి చేశారు. ఈ ఘ‌ట‌నలో 13 మంది స్వయంసేవకులు గాయపడ్డారు, అందులో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. వివ‌రాల్లోకి వెళితే ఆగ్రాలోని మోతీమహల్ ప్రాంతంలో రాష్ట్రీయ సేవాభారతికి చెందిన డాక్టర్ హెడ్గేవార్ స్ట‌డీ సెంట‌ర్ ఉంది. దానికి ఎదురుగా రాధాకృష్ణ మందిరం ఉంది. అయితే కొందరు స్థానిక ముస్లిం యువకులు ఆలయంలో నిత్యం మద్యం సేవిస్తున్నారు. ఈ ఆదివారం (డిసెంబర్ 26) కొందరు ముస్లిం యువకులు మద్యం సేవిస్తుండగా, కొందరు స్వయంసేవకులు ఆలయంలో మద్యం సేవించవద్దని ముస్లింల‌ను కోరారు. ఆ స‌మ‌యంలో ముస్లింలు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

అదే అర్థరాత్రి సుమారు 80 మంది ముస్లిం యువకులు సేవాభారతి కార్యాలయంపై దాడి చేశారు. వికాస్ గుప్తా, శివమ్ కుమార్ అనే ఇద్ద‌రు స్వ‌యంసేవ‌కుల‌కు తీవ్ర గాయాలయ్యాయి. కార్యాలయం ఆవరణలో ఉన్న భారత మాత విగ్రహాన్ని అల్లరి మూకలు ధ్వంసం చేశారు.

దాడి వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యేలు యోగేంద్ర ఉపాధ్యాయ్, మహేశ్ గోయల్, పురుషోత్తం ఖండేల్వాల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆగ్రా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుధీర్ కుమార్ హామీ ఇచ్చారు.

Courtesy : ORGANISER