Home News ప‌శ్చిమ బెంగాల్‌లో ఆర్‌.ఎస్‌.ఎస్ కార్య‌క‌ర్త దారుణ హ‌త్య‌

ప‌శ్చిమ బెంగాల్‌లో ఆర్‌.ఎస్‌.ఎస్ కార్య‌క‌ర్త దారుణ హ‌త్య‌

0
SHARE

వ్య‌క్తులు దారుణ హ‌త్య చేసిన ఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 ప‌ర‌గ‌నాస్ జిల్లాలో శ‌నివారం జరిగింది.  ఆయ‌నతో పాటు మ‌రో ఆరుగురిపై కూడా దుండ‌గులు దాడి చేసి గాయ‌ప‌రిచారు. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే ఎన్నికల సంద‌ర్భంగా బీజేపీ `ఆర్ నోయి అన్నే’ (ఇక‌పై అన్యాయం వ‌ద్దు) అనే కార్యక్ర‌మాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా శనివారం ఉత్తర 24 పరగనాస్ జిల్లాలో ఇంటింటా ప్రచారం చేస్తుండ‌గా అక్కడికి కొంతమంది వ్యక్తులు వ‌చ్చి వీరందరిని తీవ్రంగా కొట్టారు. గాయపడిన వారిని మిగతా కార్యకర్తలు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సైకత్ భవాల్ అనే కార్య‌క‌ర్త చ‌నిపోయాడు.  ఈ దాడిలో గాయపడిన మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

    తృణమూల్ కాంగ్రెస్ అండతోనే కొంతమంది గూండాలు సైకత్ భవాల్‌ను చంపారని బరాక్‌పూర్ ఎంపీ అర్జున్ సింగ్ ఆరోపించారు. ఈ సంఘటనకు వ్యతిరేకంగా ఆదివారం జిల్లాలో బీజేపీ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న చేప‌ట్టారు.