Home Telugu Articles సరస్వతీ నది ఆచూకీ కనిపెట్టిన డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకణ్కర్

సరస్వతీ నది ఆచూకీ కనిపెట్టిన డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకణ్కర్

0
SHARE

భారతీయ నాగరికత లక్షల సంవత్సరాల పురాతనమైనది, చాలా సంపన్నమైనది.  మన నాగరికత, సంస్కృతి గురించి తెలుసుకోవడానికి, ప్రపంచం నలుమూలల నుండి పరిశోధకులు భారతదేశాన్ని సందర్శించి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పరిశోధిస్తున్నారు.  భారతదేశపు ప్రాచీన నాగరికతను ప్రపంచానికి పరిచయం చేయడంలో విష్ణు శ్రీధర్ (హరిభావు) వాకణ్కర్ పేరు చెప్పుకోదగినది.  భోపాల్ నుండి 46 కిలోమీటర్ల దూరంలో,  దక్షిణాన భీమ్ బేట్కా గుహలు ఉన్నాయి.  వీటి చుట్టూ నాలుగు వైపుల వింధ్య పర్వత శ్రేణులు ఉన్నాయి.  భీమ్ బేట్కా గుహలు మహాభారతంలో భీముడికి సంబంధించినవని విశ్వాసం.  ఈ కారణంగా, వీనికి ఆ పేరు వచ్చింది.  వాటిని 1957-1958 సంవత్సరంలో డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకణ్కర్ కనుగొన్నారు.  ఇందుకోసం ఆయనకు పద్మశ్రీ లభించింది.

హరిభావు వాకణ్కర్ మే 4, 1919న నీముచ్, మధ్యప్రదేశ్ లో జన్మించారు. వాకణ్కర్ కు చరిత్ర,, పురావస్తు శాస్త్రం, చిత్రలేఖనంపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. ఆయన తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తరువాత ఉజ్జయిని విక్రమశిలా విశ్వవిద్యాలయం నుండి చదువు పూర్తి చేశాడు. తరువాత అక్కడే ప్రొఫెసర్ అయ్యారు. జె జె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో ఫైన్ ఆర్ట్స్ పి.జి చదివారు. ఉజ్జయిని సమీపంలోని దంతేవాడ గ్రామంలో పురావస్తు తవ్వకాలలో ఆయన ఎంతో శ్రమించారు.   1958 లో ఒకసారి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన ఆ మార్గంలో కొన్ని గుహలు, రాళ్ళను చూశారు.  తోటి ప్రయాణికులను అడిగినప్పుడు, ఇది భీమ్ బేట్కా (భీమా సిట్కా) అని పిలువబడే ప్రాంతమని, గుహ గోడలపై కొన్ని చిత్రాలు ఉన్నాయని తెలిసింది.  కాని అడవి జంతువులకు భయపడి ప్రజలు అక్కడికి వెళ్ళేవారుకాదు.

ఇది విన్న హరిభావుకు అవేమిటో చూడాలని, తెలుసుకోవాలన్న ఆసక్తి మొదలయ్యింది. రైలు నెమ్మదించినప్పుడు, కదిలే రైలు నుండి దూకి, ఆ కొండలను చేరుకోవడానికి గంటల తరబడి ఎక్కారు.  అక్కడ ఉన్న చిత్రాలను ఆయన మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశారు.  ఈ ఆవిష్కరణ ఆయనకి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.

భీమ్ బేట్కా గుహలు పాలియోలిథిక్ మానవుల జీవితాన్ని వర్ణిస్తాయి.  హరిభావు కనుగొన్న ఈ గుహలలో అందుకు సంబంధించిన అనేక  చిత్రాలు ఉన్నాయి.  ఇక్కడ సుమారు 500 గుహలు ఉన్నాయి.  భీమ్ బేట్కా గుహలలోని చాలా చిత్రాలు ఎరుపు, తెలుపు రంగులతో ఉన్నాయి.  కొన్ని ప్రదేశాలలో పసుపు, ఆకుపచ్చ చుక్కలు కూడా ఉపయోగించారు.  వన్యప్రాణుల వేట దృశ్యాలేకాక, గుర్రాలు, ఏనుగులు, పులులు మొదలైన చిత్రాలను ఈ గుహలలో కనిపిస్తాయి. రాళ్ళపై ముఖ్యమైన సమాచారం లభిస్తోంది.

మొత్తం 750 గుహలు ఉన్నాయి, వీటిలో 500 గుహలు చిత్రాలు కనిపిస్తాయి.  ఈ ప్రదేశం రాతియుగం నుండి మధ్య చారిత్రక కాలం వరకు మానవ కార్యకలాపాల కేంద్రంగా ఉంది.  ఈ విలువైన వారసత్వం ఇప్పుడు పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.  భీమ్ బేట్కా ప్రాంతంలోకి ప్రవేశిస్తే, రాళ్ళపై రాసిన అత్యంత విలువైన సమాచారం కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా సమూహ నృత్యాలు,  వేట, జంతువులు, పక్షులు, యుద్ధం, ప్రాచీన మానవ జీవితపు రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన రాక్ పెయింటింగ్స్  ఉన్నాయి.  చిత్రాలలో ఉపయోగించే ఖనిజ రంగులు ప్రధానంగా ఎరుపు, తెలుపు.  మరికొన్నిసార్లు పసుపు, ఆకుపచ్చ రంగులు కూడా ఉపయోగించారు.  ఇక్కడ గోడలపై మతపరమైన చిహ్నాలు కనిపిస్తాయి.  ఈ విధంగా భీమ్ బేట్కా ప్రాచీన మానవుల విజ్ఞాన వికాసపు కాలక్రమం ప్రపంచంలోని ఇతర పురాతన ప్రదేశాలకు వేల సంవత్సరాల ముందు జరిగిందని తెలుస్తుంది. అందువలన ఈ పూరాతత్వ ప్రదేశం మానవ అభివృద్ధికి ప్రారంభ బిందువుగా కూడా పరిగణిస్తున్నారు. అలాంటి అతి ముఖ్యమైన ప్రదేశాన్ని హరిబావు వాకణ్కర్ ప్రపంచానికి పరిచయం చేశారు.

వాకణ్కర్ దేశం అంతా తిరిగి ఎంతో విలువైన చారిత్రక సమాచారాన్ని వెలికితీశారు. ఆయన మృదు స్వభావి. మాటాల్లో తియ్యదనం ఉట్టిపడేది. దేశం కోసం ఎదో చేయాలనే తపన ఎప్పుడు ఆయనలో కనిపించేది.  సామాజిక రంగంలో కూడా చురుకుగా ఉండేవారు.   రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ స్వయంసేవక్ కావడంతో శ్రీధర్ వాకణ్కర్ సామాజిక రంగంలో కూడా చురుకుగా పనిచేశారు. ఆల్ ఇండియా స్టూడెంట్ కౌన్సిల్, మధ్యప్రదేశ్. అధ్యక్షుడిగా ఉన్నారు, విశ్వహిందూ పరిషత్ స్థాపించిన తరువాత 1966 లో ప్రయాగ్‌లో మొదటి ప్రపంచ హిందూ సమావేశం జరిగినప్పుడు, శ్రీ ఏక్ నాథ్  రానడే ఆయన్ని అక్కడికి పంపారు.  తరువాత హరిభావు దేశంలోని అనేక ప్రాంతాలలో పర్యటించారు.  భారతీయ సంస్కృతి, కళ, చరిత్ర, సైన్స్ మొదలైన వాటిపై ఉపన్యాసాలు ఇచ్చారు.  1981 లో సంస్కార భారతి స్థాపించబడినప్పుడు, ఆయనను దానికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.  దేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత మన చరిత్ర కమ్యునిష్ట్ లు వ్రాసినందువల్ల చరిత్ర వక్రీకరిణ జరిగిందనే విషయం అందరీకీ తెలుసు. అందుకనే  వాస్తవ చరిత్రను వెలికితీయడానికి ఇతిహాస సంకలన సమితి ప్రారంభమైంది. దీనివెనుక వాకణ్కర్ ప్రేరణ ఎంతో ఉంది.

1983 లో కురుక్షేత్రంలో ఆర్ఎస్ఎస్ లో మరో జ్యేష్ట కార్యకర్త అయిన మోరోపంత్ పింగళేతో కలిసి వాకణ్కర్ 18 మంది బృందంతో సరస్వతి షోద్ అభియాన్‌ను ప్రారంభించారు.  వారు హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ లలో పరిశోధన చేసి  సరస్వతి నది అంతర్వాహినిగా ఉందని తేల్చారు, ఇది ఇతర నదుల కంటే చాలా పురాతన చరిత్ర కలిగిన నది అని, సింధు లోయ నాగరికతకు ‘సరస్వతీ నాగరికత’ అని పేరు మార్చాలని ఆయన సూచించారు.

1988 ఏప్రిల్ 3న ఒక సమావేశంలో పాల్గొనడానికి సింగపూర్ వెళ్ళారు.  అక్కడ ఉపన్యాసం తరువాత కుర్చీలో  ఒక్కసారిగా కూలపడిపోయారు.  ఆఖరిశ్వాస వరకు దేశం గురించే ఆలోచిస్తూనే ఉన్నారు.  ఆ తరువాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆయన పేరిట ఒక అవార్డు ఏర్పాటు చేసింది. 2003 లో వాజ్ పాయ్ గారు సరస్వతి నదికి సంబంధించిన  పరిశోధనలు జరిపించడానికి కూడా వాకణ్కర్ గారే ప్రేరణ. చివరగా వారి గురించి ఒక గొప్ప విషయం.  ఏ ఇందిరాగాంధీ అయితే ఆర్ ఎస్ ఎస్ ని నిషేదించిందో ఆమె చేతులమీదుగా ఆర్ ఎస్ ఎస్ గణవేషలో బాగమైన నల్ల టోపీ ధరించి ఆయన పద్మశ్రీ అవార్డు అందుకున్నారు విష్ణు శ్రీధర్ వాకణ్కర్.

– Hindu Nagara సౌజన్యంతో..