Home News హైదరాబాద్ లో ప్రారంభమైన సేవా సంగమం

హైదరాబాద్ లో ప్రారంభమైన సేవా సంగమం

0
SHARE

సేవాభారతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నారాయణగూడ కేశవ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో సేవా సంగమం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజు నుండి రెండు రోజుల పాటు ఈ సంగమం జరుగుతుంది. ప్రారంభ కార్యక్రమంలో  పాల్గొన్న ఆర్ ఎస్ ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్రీ ఏలే శ్యాం జీ మాట్లాడుతూ సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణా మఠ్ కు చెందిన శ్రీ శితికంఠానంద, ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ సహా సేవా ప్రముఖ్ శ్రీ రాజ్ కుమార్ మఠాలే తదితరులు పాల్గొన్నారు.   

రెండురోజులపాటు జరిగే ఈ సేవా సంగమంలో వివిధ అంశాలపై చర్చ జరుగుతుంది. సమాజంలో జరుగుతున్న అనేక సేవా కార్యక్రమాల అవగాహన-ప్రేరణ, వివిధ సామాజిక సమస్యలు – పరిష్కారాలు, వివిధ సేవా సంస్థలు – సమన్వయం, నిధుల సమీకరణ –అనుసరించవలసిన  విధానాలు, ఉత్తమ సేవా కార్యక్రమాలకు ప్రోత్సాహం వంటి విషయాలపై చర్చ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

సేవా సంగమం  గురించి సంక్షిప్త పరిచయం.

రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో తెలంగాణ నలుమూలల నుండి సుమారు 300 ఎన్జీఓలు పాల్గొంటాయి. ఈ ఎన్జీఓలకు  చట్టం, వర్తింపు విషయాలు,  ప్రాజెక్ట్ నిర్వహణ, ట్రాకింగ్ఆర్థిక నిర్వహణ, సోషల్ మీడియా నిర్వహణ లపై శిక్షణ ఇవ్వబడుతుంది.

సుమారు 1000 మంది మహిళలు, 1200 మంది ఉపాధ్యాయులు పాల్గొనే ఈ కార్యక్రమంలో సెప్టెంబర్ 14 న మహిళల కోసం రెండు సమావేశాలు జరుగుతాయి, మరొకటి ఉపాధ్యాయుల కోసం సెప్టెంబర్ 15 న జరుగుతుంది. ఈ సమావేశాలు సామాజిక పరివర్తనలో మహిళలు- ఉపాధ్యాయుల పాత్ర,  సేవా మనస్తత్వాన్ని పెంపొందించుకునే విషయాలపై చర్చలు ఉంటాయి.

సమాజంలో వివిధ రంగాల  (ఎన్జిఓలు, ఉపాధ్యాయులు, మహిళలు మొదలైనవారు)వారిని నిమగ్నం చేయడం ద్వారా అణగారినవారిని శక్తివంతం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం, లక్ష్యం. సేవా భారతి దేశవ్యాప్తంగా 1,50,000 పైగా ప్రాజెక్టులు ఉన్న సంస్థ.