Home News అయోధ్య రామ మందిర‌ నిధి సమర్పణ అభియాన్ స్ఫూర్తితో కరినగర్ జిల్లాలోని శివాలయానికి మహర్దశ

అయోధ్య రామ మందిర‌ నిధి సమర్పణ అభియాన్ స్ఫూర్తితో కరినగర్ జిల్లాలోని శివాలయానికి మహర్దశ

0
SHARE

ది వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన శివాలయం. అత్యంత మహిమాన్విత శివలింగం ఆ గుడిలో కొలువై వుంది. ఒకనాడు నిత్య పూజలతో అలరారిన చరిత్ర. కాలక్రమంలో ఆ దేవాలయం ధూప దీప నైవేద్యాలకు నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకుంది.

కరినగర్ జిల్లా రామంచ గ్రామంలోని చిగురుమామిడి మండలం గుట్టమీది ఉన్న శివాలయం కాకతీయుల కాలం నాటిదని, చరిత్రకారులు, అక్కడి పెద్దలు చెప్పడం విశేషం. అలాంటి శివాలయంలోని శివలింగానికి గత కొన్ని సంవత్సరాలుగా పూజలు జరగడం లేదు. ఎవరో ఒకరు, ఎప్పుడో ఒక్కసారి వెళ్లి దీపం పెట్టేవారు తప్ప అటు ప్రభుత్వం కానీ, ఇటు హిందూ సంఘాలు గానీ ఆ మహిమాన్విత శివాలయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు.

అయోధ్య రామమందిర నిధి సమర్పణ అభియాన్ స్ఫూర్తితో మారిన ” శివాలయం ” రూపు రేఖలు…

500 ఏళ్లనాటి హిందువుల కల, 4లక్షల యాభై వేల మంది ప్రాణత్యాగాల ఫలితంగా నేడు అయోధ్యలో సాగుతున్న రామాలయ నిర్మాణానికి దేశంలో ప్రతి ఒక్క కుటుంబాన్నీ భాగస్వామ్యం చెయ్యాలనే లక్ష్యంతో సాగిన నిధి సమర్పణ కార్యక్రమంలో ఆ ఊరి యువకులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆ గ్రామ ప్రజలు రాముల వారికి భక్తి శ్రద్ధలతో నిధిని సమర్పించారు. ఈ కార్యక్రమం ఆ ఊరి యువకులను, గ్రామస్తులను ఏకం చేసింది.

వారిలో భక్తి భావం పెరిగి కొండగట్టు మీద శిథిలావస్థలో ఉన్న శివాలయానికి పూర్వవైభవం తీసుకురావాలనే పట్టుదల పెరిగింది. ఇక ఆలస్యం చెయ్యకుండా శివాలయానికి మరమ్మత్తులు చేశారు. గుడిని అత్యంత సుందరంగా తీర్చి దిద్దారు.

నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు గుడిలో వందలాది మంది భక్తుల మధ్య అత్యంత వైభవంగా శివునికి ఘనంగా అభిషేకాలు. పూజలు నిర్వహించారు.  ఆ గ్రామ యువకులు మాట్లాడుతూ ఇలాంటి హిందూ ధార్మిక చైతన్యం ప్రతి గ్రామంలో రావాలని, ధర్మ రక్షణకు, ధర్మాచరణకు ప్రతి హిందూ సోదరుడూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.