Home News జ‌వాన్ల‌కు మోడీ ప్ర‌శంస‌లు 

జ‌వాన్ల‌కు మోడీ ప్ర‌శంస‌లు 

0
SHARE
పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చడంపై  ప్రధాని ట్విట్టర్ ద్వారా స్పందించారు.  భద్రతా దళాలు మరోసారి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని ప్రధాని కొనియాడారు. జమ్మూకాశ్మీర్‌లో బలంగా వున్న ప్రజాస్వామ్య పునాదులను కదిలించేందుకు ఉగ్రవాదులు చేసిన కుట్రను సైన్యం భగ్నం చేసిందని మోడీ ప్రశంసించారు.  ఎన్‌కౌంట‌ర్ తాజా పరిస్థితులపై శుక్రవారం ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా ల‌తో  క‌లిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

జమ్మూలో రెండురోజుల క్రితం  భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే. న‌గరోటా జిల్లా జ‌మ్ము-శ్రీన‌గ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై బాన్ టోల్ ప్లాజా వద్ద భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా..  గురువారం ఉద‌యం 5గంటలకు ఒక ట్ర‌క్కులో నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా దళాలు జాతీయ రహదారిని మూసివేశాయి. దాదాపు 5 గంటలపాటు జరిగిన కాల్పుల్లో న‌లుగురు ఉగ్రవాదులు హతమవ్వగా..  భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు. ఉగ్రవాదులకు చెందిన 11 ఏకే-47 రైఫిళ్లను, 24 మేగజీన్లు, 3 పిస్టళ్లు, 35 గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్న‌ట్టు సీఆర్‌పీఎఫ్ పేర్కొంది.  వీరంతా జైష్-ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారని వెల్లడించింది.   వారు డీడీసీ (డిస్టిక్ డెవ‌ల‌ప్‌మెంట్ కౌన్సిల్‌) ఎన్నిక‌లు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.