Home News క‌ర్త‌వ్య‌ప‌థ్‌కు సెప్టెంబ‌ర్ 8న శ్రీ‌కారం

క‌ర్త‌వ్య‌ప‌థ్‌కు సెప్టెంబ‌ర్ 8న శ్రీ‌కారం

0
SHARE

రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించిన రాజ్‌ప‌థ్ పేరును కర్తవ్యపథ్ గా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. రూపురేఖలు మార్చుకున్న ఈ ప్రాంతాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 8న సాయంత్రం ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీ నగరపాలక సంస్థ (ఎన్ ఎంసీ) ఈ నెల 7న ప్రత్యేకంగా సమావేశమై రాజ్‌ప‌థ్ పేరు మార్పు ప్రతిపాదనపై చర్చించనుంది. బ్రిటిష్ పాలనలో రాజ్‌ప‌థ్ ను కింగ్స్ వే అని పిలిచేవారు. వలసవాద ఆలోచన తీరును ప్రతిబింబించే గుర్తులను చెరిపివేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించారు.