Home News బ్రహ్మోస్ మాజీ ఇంజినీర్ నిశాంత్ కి జీవిత ఖైదు.. నాగపూర్ కోర్ట్ తీర్పు

బ్రహ్మోస్ మాజీ ఇంజినీర్ నిశాంత్ కి జీవిత ఖైదు.. నాగపూర్ కోర్ట్ తీర్పు

0
SHARE

పాకిస్తాన్  నిఘా సంస్థ  ఐఎస్ఐ బ్రహ్మోస్ ఏరోస్పేస్  క్షిపణి రహస్యాలను  చేరవేసిన  కేసులో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాజీ ఇంజినీర్‌ నిశాంత్‌ అంగర్వాల్‌కి జీవిత ఖైదు పడిరది. అధికారిక రహసవ్యల చట్టం కింద నాగపూర్‌ జిల్లా కోర్టు ఈ శిక్ష వేసింది. దీంతో అతడు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి వుంటుంది. దీంతో పాటు 3,000 రూపాయల జరిమానా కూడా విధించింది కోర్టు. నిశాంత్‌ అగర్వాల్‌ నాగపూర్‌లోని బ్రహ్మోస్ కి  చెందిన మిస్సేల్  కేంద్రంలోని టెక్నికల్‌ రీసబర్చ్‌ సెక్షన్లో  పనిచేసేవాడు. అక్కడ నాలుగేండ్లు విధులు నిర్వర్తించాడు. ఈ సమయంలోనే బ్రహ్మోస్ కి  సంబంధించిన కీలక సాంకేతిక  సమాచారాన్ని పాక్‌  ఐఎస్ఐకి లీక్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2018 లో యూపీ, మహారాష్ట్రకి చెందిన సైనిక నిఘా, ఉగ్రవాద నిరోధక బృందాలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అరెస్ట్ అయ్యాడు. తర్వాత పలు సబక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి.