Home News తెలంగాణ: మ‌త‌మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్నపాస్ట‌ర్ పై పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు

తెలంగాణ: మ‌త‌మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్నపాస్ట‌ర్ పై పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు

0
SHARE

అమాయ‌కుల క‌ష్టాల‌ను ఆసరాగా చేసుకుని బ‌ల‌వంత‌పు మ‌త మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్న ఒక పాస్ట‌ర్‌ను స్థానిక హిందువులు, వి.హెచ్‌.పి నాయ‌కులు అడ్డుకున్న ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని వ‌న‌స్థ‌లిపురంలో జ‌రిగింది. వి.హెచ్.‌పి నాయ‌కులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం విజ‌య‌వాడ‌కు చెందిన పాస్ట‌ర్ ర‌వికుమార్ ప్ర‌తీ ఆదివారం హైద‌రాబాద్‌కు వ‌చ్చి డ‌బ్బుల ఆశ చూపిస్తూ, కుటుంబాల్లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ఆస‌రాగా తీసుకుని వాటిని ప‌రిష్కారిస్తార‌ని న‌మ్మ‌బ‌లికి మ‌త‌మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు స్థానిక హిందువులు గుర్తించారు.

వ‌న‌స్థ‌లిపురంలోని సాగ‌ర్ కాంప్లెక్స్ ప‌రిస‌ర ప్రాంతాల‌కు చెందిన ఇద్ద‌రు హిందూ విద్యార్థినుల‌ను మ‌తం మారాల‌ని బ‌ల‌వంతం చేస్తూ వేదింపుల‌కు పాల్ప‌డుతున్నాడు. అంతకు ముందే తల్లిని మతం మార్చిన పాస్ట‌ర్‌, తల్లితో కలిసి ఇద్దరు కూతుళ్ళను కూడా మతం మారమంటూ ఒత్తిడి చేస్తున్నాడు. వారు అభ్య‌త‌రం తెలుపడంతో విష‌యం తెలుసుకున్నస్థానిక‌ హిందువులు, వి.హెచ్‌.పి ఆధ్వ‌ర్యంలో పాస్ట‌ర్ రవికుమార్ పై వనస్థలీపురం పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంట‌నే స్పందించి త‌గిన విచార‌ణ జ‌రిపించి బ‌ల‌వంత‌పు మ‌త‌మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్న పాస్ట‌ర్ ర‌వికుమార్‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన‌ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వి.హెచ్‌,పి నాయ‌కులు స్థానిక హిందువులు డిమాండ్ చేశారు.