Home News మతమార్పిళ్ల‌కు పాల్పడుతున్న ఎన్జీవోలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

మతమార్పిళ్ల‌కు పాల్పడుతున్న ఎన్జీవోలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

0
SHARE

బలవంతపు, మోస‌పురిత‌పు మతమార్పిడులకు పాల్పడుతున్న ఎన్జీవోలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేసింది. ప్రతి స్వచ్ఛంద సంస్థ చేసే మంచి పనిని స్వాగతించవచ్చు, కానీ సంస్థ చేసే ప‌ని వెన‌క ఉద్దేశాన్ని గ‌మ‌నించాల్సిన అవసరం ఉంది అని సుప్రీం కోర్టు పేర్కొంది. బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను విచార‌ణ స‌మ‌యంలో కోర్టు పై వ్యాఖ్య‌లు చేసింది.

బహుమతులు, ఆర్థిక‌ ప్రయోజనాల ద్వారా, బెదిరింపులు, మోసపూరితంగా ప్రలోభపెట్టడం ద్వారా మత మార్పిడిని నియంత్రించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఫైల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు ఎంఆర్ షా, సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమ‌వారం విచారణ చేపట్టింది. మాయ‌మాట‌లు చెప్పి, మందులు, బ‌హుమ‌తులు అందించడం ద్వారా ఇతర మతాలలోకి మారమని ప్రజలను ఆహ్వానించడం చాలా తీవ్రమైన సమస్య అని జ‌స్టీస్ ఎంఆర్ షా ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు.

దాతృత్వం పేరుతో ప్ర‌జ‌లు మత‌మార్పిడికి గుర‌వ‌డం, మ‌త మార్పిళ్ల‌కు ప్రలోభపెట్టడం ప్రమాదకర‌మ‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. బలవంతపు మతమార్పిడుల అంశంపై వివరణాత్మక అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్రాలను న్యాయమూర్తులు ఎంఆర్ షా, సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆహ్వానించింది. కొన్ని మతపరమైన ఆదేశాలు, మిషనరీలపై వారు తమ పిల్లలకు విద్యతో సహా వివిధ రకాల స్వచ్ఛంద కార్యక్రమాలను అందజేసి ఇతర మతాల ప్రజలను మతం మారుస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టు డిసెంబర్ 12న విచారణ చేపట్టనుంది.

బలవంతపు మత మార్పిడి జాతీయ భద్రతకు ముప్పు తెచ్చిపెడుతుందని, పౌరుల మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొంది. ఈ తీవ్రమైన సమస్యను పరిష్కరించడానికి కేంద్రం చొరవ తీసుకోవాలని, నిజాయితీగా ప్రయత్నించాలని కోరింది.

మతస్వేచ్ఛలో ఇతరులను మతం మార్చే హక్కు ఉండదని గుజరాత్ ప్రభుత్వం అంతకుముందు సుప్రీంకోర్టుకు తెలిపింది. వివాహం ద్వారా మత మార్పిడికి జిల్లా మేజిస్ట్రేట్ ముందస్తు అనుమతి అవసరమయ్యే రాష్ట్ర చట్టంపై హైకోర్టు స్టేను తొలగించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది. సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌పై కేంద్రంతో పాటు ఇతరుల నుంచి స్పందనను కోరింది.

బలవంతపు మత మార్పిడి దేశవ్యాప్త సమస్య అని, దీనిని తక్షణమే నియంత్రించాల్సిన అవసరం ఉందని, “హుక్ అండ్ క్రూక్” ద్వారా మత మార్పిడి లేని జిల్లా ఒక్కటి కూడా లేనందున పౌరులకు పెద్ద‌ అన్యాయం జ‌రిగింద‌ని ఉపాధ్యాయ్ తన పిటిషన్‌లో సమర్పించారు. మతం మార్చే సంఘటనలు దేశవ్యాప్తంగా ప్రతి వారం నమోదవుతున్నాయని, కానీ కేంద్ర‌, రాష్ట్రాలు ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన కఠిన చర్యలు తీసుకోలేదని కూడా పిటిషన్ పేర్కొంది. మత మార్పిడిని నియంత్రించడానికి ఒక నివేదికతో పాటు బిల్లును రూపొందించడానికి లా కమిషన్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషన్ కోరింది.

SC/ST పిల్లలను ల‌క్ష్యంగా చేసుకుని మ‌త‌మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్న క్రైస్త‌వ మిషనరీలు

సామాజిక సేవ పేరుతో పిల్ల‌ల సంర‌క్ష‌ణ కేంద్రాలను నిర్వ‌హిస్తున్న క్రైస్త‌వ మిష‌న‌రీలు కూడా మ‌త మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్నాయి. ముఖ్యంగా SC/ST ల‌కు చెందిన సంచార జాతి పిల్ల‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని మిష‌న‌రీలు ఈ దారుణాల‌కు పాల్ప‌డుతున్నాయి.

జువెనైల్ జస్టిస్ యాక్ట్, SC ST చట్టం, FCRA చట్టాన్ని ఉల్లంఘించినందుకు తమిళనాడులోని సంచార తెగలకు చెందిన పిల్ల‌ల‌ను లక్ష్యంగా చేసుకుని మ‌త మార్పిళ్ల‌కు పాల్ప‌డుతున్న క్రైస్తవ మిషనరీ NGOల‌పై ఇటీవ‌ల అనేక ఫిర్యాదులు నమోద‌య్యాయి. తమిళనాడుకు చెందిన బెథాన్య విజన్ ట్రస్ట్ (BVT), విదేశీ నిధులను ఉపయోగించి ఆంద్ర‌ప్ర‌దేశ్, త‌మిళ‌నాడుక చెందిన నారికురవర్, చెంచు జాతి పిల్లలను మ‌త మార్పిడి చేస్తున్నారు. పాఠశాలలకు పంపే స్థోమత లేని రోజువారీ కూలీల పిల్లలను, వృద్ధులు మాత్ర‌మే ఉండే ఇంట్లోని పిల్ల‌ల్ని చూసుకోవ‌డానికి ఈ సంస్థ తమిళనాడులో ఒక‌టి , ఆంధ్ర ప్రదేశ్‌లో 2 ‘చిల్డ్రన్స్ హోమ్’లను నడుపుతోంది.

2015లో స్థాపించిన జిప్సీ న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హోమ్ నరికిరవర్ అనే తెగ‌కు చెందిన పిల్లలను లక్ష్యంగా చేసుకుంది. నారికురవర్ అనే సంచార తెగ, అడవిలో వేటాడుతూ జీవ‌నం కొన‌సాగిస్తారు. వారు చాలా కాలం అడవిలో ఉంటారు. ప్రభుత్వం ఈ తెగ‌కు స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డం, కుల ధృవీకరణ పత్రాలు కూడా లేక‌పోవ‌డంతో వీరికి ఎలాంటి ప్రయోజనాలు అంద‌డం లేదు. వారి పిల్లలకు సరైన విద్యను అందించడం లేదు. అందువల్ల వారు ఈ మిషనరీల‌ను న‌మ్మి వారి పిల్ల‌ల్ని చిల్డ్ర‌న్స్ హోమ్స్‌లో పెడుతున్నారు. తిరునీర్మలైలో బెతన్యా అనే మరో బాలల గృహాం క్వారీ కార్మికుల పిల్లలను కూడా ఇదే పద్ధతిలో మ‌త మార్పిడి చేస్తున్నారు.

బెథాన్య విజన్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన బాలల గృహాన్ని కూడా నిర్వహిస్తోంది. రాష్ట్రానికి చెందిన చెంచు తెగకు చెందిన 50 మంది పిల్లలు ఉన్నారు. 2015లో స్థాపించిన ఈ ఇంటికి స్థానిక పోస్టర్ కూడా సహాయం చేస్తున్నాడు. BVT ఇంటర్నేషనల్, BVT ఇండియా వెబ్‌సైట్‌లో ఈ పిల్లలను క్రైస్తవ ప్రార్థనా సమావేశాల్లో కూర్చోబెట్టి ప్రార్థన చేసినట్లు ఉన్న వీడియోలు ఉన్నాయి.

బెథాన్య విజన్ ట్రస్ట్ నిర్వహిస్తున్న పిల్లల గృహాలలో జువెనైల్ జస్టిస్ చట్టం, SC ST చట్టం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఉల్లంఘనలను లీగల్ రైట్స్ ఫోరమ్ కనుగొంది. ఇది తన FCRA లైసెన్స్‌ని రద్దు చేయాలని కోరుతూ ఈ ఉల్లంఘనలను వెలుగులోకి తెస్తూ ఫిర్యాదులను దాఖలు చేసింది.