Home News భువనేశ్వర్ లో ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాలు

భువనేశ్వర్ లో ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాలు

0
SHARE

ప్రతిసంవత్సరం జరిగే అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాలు ఈసారి భువనేశ్వర్ లో జరుగుతాయి. మూడురోజులపాటు (16 అక్టోబర్ నుంచి 18 అక్టోబర్ వరకు) జరిగే ఈ సమావేశాల్లో పరమపూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్, సర్ కార్యవాహ సురేశ్ (భయ్యాజీ) జోషి లు ఉంటారు. అఖిల భారతీయ, క్షేత్ర, ప్రాంత అధికారులు వివిధ అంశాలపై జరిగే చర్చల్లో పాల్గొంటారు. దేశం మొత్తం నుంచి 400 మంది వీటికి హాజరవుతారు. మార్చి మాసంలో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభలో రూపొందించుకున్న ప్రణాళికపై 6నెలల తరువాత ఈ సమావేశాల్లో సమీక్ష జరుగుతుంది. ఈ సమావేశాల్లో కార్య విస్తరణ, కార్యకర్తల ప్రశిక్షణ మొదలైన సంస్థాగత అంశాల గురించి మాత్రమే చర్చ జరుగుతుంది.
అరుణ్ కుమార్
అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్