Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

రామ్‌ప్రసాద్ బిస్మిల్

విప్లవానుజులకు విషయమును తెలిపి
కలిసి దాడి చేసె కాకొరి నను
రగ రగ రగిలేటిరాంప్రసాదు గనుము
వినుర భారతీయ వీరచరిత

భావము

ఆంగ్ల పాలకుల ఆయుధాలు, డబ్బుతో వెళుతున్న రైలును స్వరాజ్య సమరయోధుడు రామ్‌ప్రసాద్ బిస్మిల్ కనిపెట్టారు. అదే విషయాన్ని తోటి విప్లవకారులకు తెలియజేశారు. రైలులో తరలిపోతున్న ఆయుధాలు, డబ్బును స్వతంత్ర సమరానికి సహాయకారిగా చేసుకోవాలని భావించారు. కాకోరి అనే ప్రదేశంలో రైలు నుంచి ఆయుధాలను, డబ్బును దోపిడీ చేసి, బ్రిటీషువారి గుండెల్లో రైళ్ళు పరిగెత్తించి, రగడ నిప్పు కనిక లాగ రగిలినట్టి రామ్‌ప్రసాద్ బిస్మిల్ వీర చరిత విను ఓ భారతీయుడా!

-రాంనరేష్