ఢిల్లీలో ఇమామ్లకు వేతనాలు… రాజ్యాంగ ఉల్లంఘనే – కేంద్ర సమాచార కమిషనర్
ఢిల్లీలోని మసీదులలో ఇమామ్లు, ముస్లిం మతపెద్దలకు వేతనాన్ని అనుమతిస్తూ 1993 సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పన్ను చెల్లింపుదారుల డబ్బును ఏదైనా ప్రత్యేక మతానికి అనుకూలంగా ఉపయోగించరాదని పేర్కొన్న రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని కేంద్ర సమాచార కమిషనర్ ఉదయ్ మహుర్కర్ అన్నారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ పిటిషన్ ఆధారంగా, 1993లో సుప్రీంకోర్టు వక్ఫ్ బోర్డు నిర్వహించే మసీదుల్లోని ఇమామ్లకు వేతనం ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మసీదుల ఇమామ్లకు రూ.10,000 నుండి రూ.18,000 వరకు జీతాలు...
చైనాలో ప్రజల ఆగ్రహం… COVID లాక్డౌన్కు వ్యతిరేకంగా నిరసనలు
ప్రమాదంలోనూ నిబంధనలు సడలించని వైనం పత్రికా స్వేచ్చకు భంగం చైనా పశ్చిమ జిన్జియాంగ్ ప్రావిన్స్లో కోవిడ్ లాక్డౌన్ కు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగాయి. చైనా దేశవ్యాప్తంగా అంటువ్యాధులు రికార్డును స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఆగస్టు నుంచి లాక్డౌన్ విధించారు. అయితే ఇటీవల ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించడం ప్రజల ఆగ్రహానికి కారణమయింది. ఒకవైపు లాక్డౌన్ నిబంధనలు, మరో వైపు అగ్నిప్రమాదంలో ప్రజలు చిక్కుకుపోయారు. దీంతో లాక్డౌన్ ఎత్తివేయాలని ఆందోళన చేశారు. నవంబర్ 25 శుక్రవారం రాత్రి చైనీస్ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలలో...
VIDEO: ఝార్ఖండ్ స్వాతంత్ర్య వీరులు నీలాంబర్, పీతాంబర్
ఝార్ఖాండ్ కి చెందిన నీలాంబర్, పీతాంబర్ ఇద్దరూ 1857లో ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన మొదటి స్వాతంత్య్ర పోరాటంలో నాయకత్వం వహించి దేశమాత స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప స్వతంత్య్ర సమరయోధులు, వీరు ఝార్ఖండ్ లోని లతేహార్ జిల్లాలోని కెమో సేన్యా గ్రామంలో జన్మించారు. శారు ఖర్వార్ తెగకుచెందిన భోగ్తా వంశానికి చెందిన వారు. వారి తండ్రి పేరు చెముసింగ్, జాగీర్దార్ గా పనిచేవారు.
‘సెక్యులరిజం అంటే మెజారిటీ ప్రజల హక్కులను హరించడం కాదు!’
రాజ్యాంగ దినోత్సవం (నవంబర్ 26) సందర్భంగా జస్టిస్ నరసింహారెడ్డితో జాగృతి ముఖాముఖీలోని కొన్ని అంశాలు: రెండవ భాగం ప్రశ్న : సెక్యులరిజం అనే మాటను లేక భావనను రాజ్యాంగంలో చేర్చడానికి మన రాజ్యాంగ నిర్మాతలు సందేహించారు. కానీ ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ దానిని రాజ్యాంగంలోకి తీసుకొచ్చారు. తరువాత పరిణామాలు ఏమిటి? ఇపుడు సెక్యులరిజం పేరుతో, కొత్త భాష్యాలతో దేశాన్ని వర్గాలుగా చీల్చే ప్రయత్నం, ఒక విషాదకర దృశ్యం కనిపిస్తోంది. దీన్ని ఎలా చూస్తారు? జవాబు : సెక్యులరిజమనేది భారతీయ సంప్రదాయంలో ఇమడని భావన. ఎందుకంటే, క్రైస్తవం...
శక్తిని ఆవిష్కరించే దిశగా ‘బాలికా శక్తి సంగమం’
మహిళల్లోని అమితమైన శక్తిని వెలికి తీసేందుకు ఉద్దేశించిన వినూత్న కార్యక్రమమే బాలిక శక్తి సంగమం అని శ్రీ సరస్వతీ విద్యా పీఠం సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్ రావు అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 400 దాకా విద్యాలయాలను సేవ భావనతో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతీ విద్యాపీఠం 50 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా స్వర్ణోత్సవాలు జరుపుకొంటోంది. స్వర్ణోత్సవాల్లో భాగంగా బాలికా శక్తి సంగమం పేరుతో వినూత్నమైన కార్యక్రమం నిర్వహిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల నుంచి వేలాది బాలికలను ఒక్క చోటకు చేర్చారు....
దేశ ప్రజలందనీ ఒక్కటిగా చేయడమే రాజ్యాంగం ముఖ్య ఉద్దేశం – శ్రీ ఇంద్రేష్ జీ
దేశ ప్రజలందరనీ ఒక్కటిగా చేయడమే రాజ్యాంగ ముఖ్య ఉద్దేశమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ కార్య కారిణి సభ్యులు శ్రీ ఇంద్రేష్ జీ అన్నారు. సామాజిక సమరసతా వేదిక, ముస్లిం రాష్ట్రీయ మంచ్, SC/ST హక్కుల ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జాకిర్ హుస్సేన్ ఆడిటోరియంలో భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 న ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా సామాజిక సమరసతా వేదిక అఖిల భారత కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ జి స్వయంగా రాసిన తెలుగు పుస్తకాన్ని ఉర్దూ యూనివర్సిటీ...
Indian Constitution Day; Not just a document frozen in time! Generations inherit and in turn leave an imprint!
Our Constitution is the voice of marginalized and prudence of majority. Its wisdom continues to guide us in moments of crisis. It is our best interest to heed advice under the Constitution. If we do not, our hubris will result in a sharp descent into chaos. Although this being the 69th year since the...
FIFA ప్రపంచ కప్ ప్రారంభోత్సవానికి జాకీర్ నాయక్ కు అధికారిక ఆహ్వానం పంపలేదు – ఖతర్
`మత నిష్టను’ ప్రదర్శించడంలో చాలా చురుకుగా ఉండే ఖతార్ ఇప్పుడు అదే విషయంలో ఇరుకున పడింది. ప్రపంచ ఫుట్ బాల్ పోటీల ప్రారంభోత్సవానికి మతమౌఢ్య బోధకుడు జాకీర్ నాయక్ కు ఆహ్వానం పలికిన ఆ దేశం భారత్ తీవ్ర అభ్యంతరాలు తెలుపడంతో వివరణ ఇచ్చుకుంది. జాకీర్ నాయక్ ను అధికారికంగా ఆహ్వానించలేదని సంజాయిషీ తెలుపుకుంది. మనీలాండరింగ్ , తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడి భారత నుంచి పారిపోయిన, రాడికల్ ఇస్లామిస్ట్ బోధకుడు జకీర్ నాయక్కు నవంబర్ 20, 2022న దోహాలో జరిగే ఫిఫా ప్రపంచ కప్...
VIDEO: కేరళ వనవాసీ వీరుడు “తలక్కల్ చందు”
ప్రథమ స్వతంత్య్ర సంగ్రామానికి పూర్వమే సుమారు ఐదు దశాబ్దాల క్రితం కేరళలోని వాయనాడ్ ప్రాంతాల్లో ఈస్టిండియా కంపెనీ వారికి, కురిచ్చా వనవాసీ వీరులకు మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. గెరిల్లా పద్ధతిలో కొనసాగించిన ఈ యుద్ధంలో వీరమరణం పొందిన నాయకుడు తలక్కల్ చందు. సుమారు పద్దెనిమిదవ శతాబ్దం ద్వితీయార్థంలో దక్షిణ భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా స్థానిక జమిందారులు, రాజులు పలువురు పోరాడారు. ఆ క్రమంలోనే ఈస్టిండియా కంపెనీ ఆగడాలకు కేరళ వనవాసీ వీరులు అడ్డుకట్ట వేశారు. ఈ...
“మన అసలు చరిత్రను యువత తెలుసుకోవాలి”
యువసమ్మెళనంలో వక్తలు నైజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా ఏడాది పాటు జరుగుతున్న కార్యక్రమాల్లో నవంబర్ 24 గురువారం రోజున భువనగిరి పట్టణంలోని సాయి కన్వేన్షన్ హాల్లో యువ సమ్మెళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వక్తలలో ఒకరైన ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్ గారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం కోసం అనేక మంది బలిదానాలు చేశారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం రాలేదని, ఈ ప్రాంతమంతా కుడా నైజాం దొరల...